Russia Strikes Ukraine : ఉక్రెయిన్ పై రష్యా మరోసారి క్షిపణి దాడి.. పోస్టల్ డిపోపై దాడి ఘటనలో ఆరుగురు మృతి
ఈ దాడికి సంబంధించిన వీడియోను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. మృతులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉత్తర ఖర్కీవ్ లోని బెల్గోరోడ్ ప్రాంతంలో ఉన్న రష్యన్ బలగాలు ఎస్ -300 క్షిపణులను ప్రయోగించాయని, వాటిలో రెండు పోస్టల్ డిపోపై పడినట్లు స్థానిక అధికారులు తెలిపారు.
Russia Vs Ukraine War: ఒకవైపు ఇజ్రాయెల్ – హమాస్ భీకర పోరు కొనసాగుతుంది. ఇలాంటి సమయంలో సద్దుమణిగిందనుకున్న ఉక్రెయిన్ – రష్యా వార్ మళ్లీ తెరపైకి వచ్చింది. తాజాగా రష్యా సైన్యం మరోసారి ఉక్రెయిన్ పై దాడికి పాల్పడింది. ఆ దేశంలోని ఖర్కీవ్ లో ఉన్న పోస్టల్ డిపో భవనంపై క్షిపణి ప్రయోగించింది. దీంతో డిపో భవనం ధ్వంసమైంది. అందులో పనిచేస్తోన్న ఆరుగురు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మందికి తీవ్రగాయాలయ్యాయి. భవనం శిథిలాల కింద కొందరు చిక్కుకున్నట్లు సమాచారం. అయితే, ఈ ఘటన జరిగిన వెంటనే రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. భవనం శిథిలా కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు చర్యలు చేపట్టారు.
ఈ దాడికి సంబంధించిన వీడియోను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. మృతులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉత్తర ఖర్కీవ్ లోని బెల్గోరోడ్ ప్రాంతంలో ఉన్న రష్యన్ బలగాలు ఎస్ -300 క్షిపణులను ప్రయోగించాయని, వాటిలో రెండు పోస్టల్ డిపోపై పడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మృతులంతా 19 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారని అధికారులు పేర్కొన్నారు.
Kharkiv region. A Russian missile struck a post terminal. Ordinary civilian object. Unfortunately, there are killed. My condolences to all of their close ones!
As of now, it is known that at least 13 people were injured. First responders and all services are working on the spot.… pic.twitter.com/gN94DOIJtL
— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) October 21, 2023