Shooting In School : స్కూల్‌లో కాల్పులు, 10 మంది మృతి..! ఒక్కసారిగా ఉలిక్కిపడిన స్వీడన్..

స్కూల్ లో కాల్పుల ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.

Shooting In School : స్కీడన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. స్వీడన్ ఒరెబ్రో సిటీలోని స్కూల్ లో కాల్పులు కలకలం రేపాయి. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 10 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. కాల్పులు జరిపిన దుండగుడిని పోలీసులు హతమార్చారు. దేశ చరిత్రలోనే ఇదొక భయంకరమైన ఘటనగా పోలీసులు అధికారులు అభివర్ణించారు.

గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వెస్ట్ స్టాక్ హోమ్ కు 200 కిలోమీటర్ల దూరంలో ఉండే విద్యా సంస్థలో ఈ ఘటన జరిగింది. కాల్పుల గురించి తెలిసిన వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు. స్కూల్ ని చుట్టుముట్టారు. తమ ఆధీనంలోకి తీసుకున్నారు. విద్యార్థులను, స్టాఫ్ ను సురక్షిత ప్రాంతానికి తరలించారు.

Also Read : బాప్ రే.. ఒక్క ఫోన్ కాల్‌తో 11 లక్షలు పోగొట్టుకున్న ఐటీ ఉద్యోగిని.. బీకేర్ ఫుల్ అంటున్న పోలీసులు.. ఏం జరిగిందో తెలిస్తే షాకే..

స్కూల్ లో కాల్పుల ఘటనతో స్వీడెన్ ఉలిక్కిపడింది. ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంది. దీనిపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించింది. కాల్పుల ఘటనతో ఒరెబ్రో ప్రాంతంలోని ఇతర విద్యాసంస్థల యాజమాన్యాలు అలర్ట్ అయ్యాయి. పిల్లలను, స్టాఫ్ ను విద్యాసంస్థల లోపలే ఉంచేశాయి. పోలీసుల సలహా మేరకు వారు ఇలా చేశారు. మరోవైపు ఘటన జరిగిన ప్రాంతంలో నివాసం ఉండే వారిని ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు చెప్పారు. తాము చెప్పే వరకు ఎవరూ బయటకు రావొద్దన్నారు.

Also Read : వీడిని ఏం చేసినా పాపం లేదు..! ఆ వీడియోలతో ఐటీ ఉద్యోగినిని బ్లాక్ మెయిల్ చేసిన కేటుగాడు, ఏకంగా 2కోట్ల 53 లక్షలు వసూలు, అయినా ఇంకా వేధింపులు..

కాల్పులు జరిపిన దుండగుడు ఎవరు? ఎందుకు జరిపాడు? అతడి లక్ష్యం ఏంటి? అనే వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు. దీనిపై ముమ్మరంగా దర్యాఫ్తు చేస్తున్నారు. కాల్పుల ఘటన తర్వాత పోలీసులు సెక్యూరిటీని పెంచారు.