CIL Notification 2026 : జాబ్ అంటే ఇదిరా సామీ.. పరీక్ష లేదు.. నెలకు రూ.2 లక్షల వరకు జీతం.. ఈ అర్హతలుంటే చాలు.. !
CIL Notification 2026 ప్రభుత్వ ఉద్యోగం కోసం చూసేవారికి పండగలాంటి వార్త. నెలకు రూ.2 లక్షల వరకు జీతం పొందే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేసన్ విడుదలయ్యింది. రాత పరీక్ష లేకుండా వీటిని భర్తీ చేయనున్నారు.
- Dharani Pilli
- Updated on- May 8, 2026 / 06:27 PM IST
coal india limited notification 2026 for 276 management trainee posts apply online details here
CIL Notification 2026 : మంచి జాబ్, అందునా ప్రభుత్వ కొలువు కోసం ఎదురుచూసే వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నెలకు రూ. 2 లక్షల వరకు జీతం వచ్చే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. పైగా రాత పరీక్ష లేకుండా ఎంపిక చేయనుంది. ఇంక ఇంతకంటే మంచి ఛాన్స్ వస్తుందా.. అందుకే త్వరపడండి! ఇంతకీ ఈ ఉద్యోగాలు ఏ విభాగంలో భర్తీ చేస్తున్నారంటే.. కేంద్ర మంత్రిత్వ శాఖకు చెందిన కోల్కతాలోని కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) – మైనింగ్ విభాగంలో. ఈ డిపార్ట్మెంట్లో మేనేజ్మెంట్ ట్రైనీ (MT) పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ క్రమంలో తాజాగా కోల్కతా CIL అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 276 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు. పరీక్ష లేదంటే మరి ఎలా ఎంపిక చేస్తారంటే.. గేట్ (GATE) 2025 స్కోర్ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ రోజు శుక్రవారం, మే 8 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.
అర్హతలు:
ఈ మేనేజ్మెంట్ ట్రైనీ (మైనింగ్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు
- మైనింగ్ ఇంజినీరింగ్లో బీఈ (BE) లేదా బీటెక్ (B.Tech) డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కనీసం 60 శాతం మార్కులు ఉండాలి.
- ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 55 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది.
- దీనితో పాటు గేట్ 2025 పరీక్షలో అర్హత సాధించి ఉండాలి.
వయసు:
- అభ్యర్థుల వయసు ఏప్రిల్ 30, 2026వ తేదీ నాటికి 30 ఏళ్లకు మించకూడదు.
- ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వరకు వయోసడలింపు ఉంటుంది.
దరఖాస్తు తేదీ:
పైన పేర్కొన్న అర్హతలు కలిగిన అభ్యర్థులు.. జూన్ 7, 2026వ తేదీలోపు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఫీజు:
- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు దరఖాస్తు రుసుము కింద రూ. 1,180 చెల్లించాల్సి ఉంటుంది.
- ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యూడి మరియు కోల్ ఇండియా ఉద్యోగులకు ఎలాంటి ఫీజు లేదు.
ఎంపిక ప్రక్రియ:
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను గేట్ 2025 స్కోర్ ఆధారంగా షార్ట్లిస్ట్ చేస్తారు.
- షార్ట్లిస్ట్ అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
వేతనం:
- ఎంపికైన వారికి శిక్షణ కాలంలో నెలకు రూ. 60,000 చొప్పున చెల్లిస్తారు.
- శిక్షణ విజయవంతంగా పూర్తయ్యాక నెలకు రూ. 1,80,000 వరకు జీతంగా చెల్లిస్తారు.
