Chhattisgarh: ఛత్తీస్ఘడ్లో దారుణం జరిగింది. దివ్యాంగుడిని రోడ్డుపైనే పొడిచి చంపిందో బాలిక. ఈ ఘటన రాజధాని రాయ్పూర్లోని ఆజాద్ చౌక్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పదహారేళ్ల బాలిక బైక్పై వెళ్తుండగా, దివ్యాంగుడైన ఒక వ్యక్తి సైకిల్పై అదే దారిలో వెళ్తున్నాడు.
Son Murdered By Father: కొడుకును చంపి ముక్కలుగా నరికిన తండ్రి.. తప్పించుకునేందుకు ఏం చేశాడంటే
అతడికి చెవులు వినిపించకపోవడంతోపాటు, మాటలు కూడా రావు. సైకిల్ వెనకాల బైక్ నడుపుతూ వస్తున్న ఆ బాలిక హారన్ మోగించింది. అయితే, అతడికి వినపడకపోవడంతో హారన్ మోతకు స్పందించలేదు. పక్కకు తప్పుకోలేదు. దీంతో కోపం తెచ్చుకున్న ఆ బాలిక ఆ దివ్యాంగుడిపై దాడి చేసింది. ఈ క్రమంలో తన వెంట తెచ్చుకున్న కత్తితో అతడి మెడపై పొడిచింది. వెంటనే అతడు అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బాలిక కోసం వెతికారు.
Rajnath Singh: పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమే: రాజ్నాథ్ సింగ్
మందిర్ హసౌద్ ప్రాంతంలో బాలికను అదుపులోకి తీసుకున్నారు. ఆమె దగ్గరి నుంచి కత్తి స్వాధీనం చేసుకున్నారు. సోమవారం బాలికను జువైనల్ జస్టిస్ బోర్డుకు తరలిస్తామని ఎస్పీ పటేల్ తెలిపారు.