Son Murdered By Father: కొడుకును చంపి ముక్కలుగా నరికిన తండ్రి.. తప్పించుకునేందుకు ఏం చేశాడంటే

కన్న కొడుకునే అత్యంత కర్కశంగా హత్య చేశాడో తండ్రి. ఆ తర్వాత కొడుకు మృతదేహాన్ని ఆరు ముక్కలుగా నరికాడు. వాటిని ప్లాస్టిక్ బ్యాగుల్లో పెట్టి, బయటకు తీసుకెళ్లాడు. ఆరు భాగాల్ని, ఆరు చోట్ల వదిలేశాడు. కానీ, పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన గుజరాత్‌లో జరిగింది.

Son Murdered By Father: కొడుకును చంపి ముక్కలుగా నరికిన తండ్రి.. తప్పించుకునేందుకు ఏం చేశాడంటే

Son Murdered By Father

Son Murdered By Father: కన్న కొడుకునే తండ్రి దారుణంగా హతమార్చిన ఘటన గుజరాత్‌లో జరిగింది. హత్య చేయడమే కాదు.. ఆ తర్వాత కొడుకు శవాన్ని ఆరు ముక్కలుగా నరికాడు. అహ్మదాబాద్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్వయం జోషి అనే 21 ఏళ్ల యువకుడు మద్యానికి, డ్రగ్స్‌కు బానిస అయ్యాడు. రోజూ తాగి, డ్రగ్స్ తీసుకుంటూ ఉండేవాడు.

Syed Hafeez: ‘ఫోర్బ్స్ ఇండియా’ జాబితాలో తెలంగాణ వాసికి చోటు

వీటి ఖర్చుల కోసం డబ్బులు కావాలని తండ్రిని వేధించేవాడు. ఈ విషయంలో తండ్రి నిలేష్‌కు, కొడుకు స్వయం జోషికి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. తండ్రి ఎంత చెప్పినా వినేవాడు కాదు. ఈ క్రమంలో ఈ నెల 18న కూడా మద్యానికి డబ్బులు కావాలని స్వయం జోషి, తండ్రిని అడిగాడు. దీనికి తండ్రి నిరాకరించాడు. ఇది ఇద్దరిమధ్యా వాగ్వివాదానికి దారి తీసింది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన తండ్రి, కొడుకు స్వయం జోషిపై వంట గదిలో వాడే ఒక రాయి తీసుకుని దాడి చేశాడు. దీంతో కొడుకు అక్కడికక్కడే మరణించాడు. తర్వాత ఏం చేయాలో తెలియలేదు. దొరికిపోతానని భావించిన తండ్రి, బయటకు వెళ్లి ఒక పెద్ద ఎలక్ట్రిక్ గ్రైండర్, కొన్ని ప్లాస్టిక్ బ్యాగ్స్ కొనుక్కొచ్చాడు. తర్వాత కొడుకు మృతదేహాన్ని బాత్ రూమ్ తీసుకెళ్లి, అక్కడ గ్రైండర్‌లో ఆరు ముక్కలుగా కోశాడు.

Rahul Gandhi: అగ్నిపథ్ పథకంపై మరోసారి మండిపడ్డ రాహుల్.. మోదీని ఏమన్నారంటే..

ఆరు ముక్కల్ని ప్లాస్టిక్ బ్యాగుల్లో ఉంచి, బైక్‌పై బయటకు తీసుకెళ్లాడు. అహ్మదాబాద్‌తోపాటు అనేక ప్రాంతాల్లో శరీర భాగాలు వదిలేసి వచ్చాడు. ఆరు భాగాల్ని ఆరు చోట్ల వదిలిపెట్టాడు. తర్వాత గోరఖ్‌పూర్ వెళ్లి, అక్కడ్నుంచి నేపాల్ పారిపోవాలనుకున్నాడు. ఈ క్రమంలో స్వయం జోషి శరీర భాగాలు రెండు చోట్ల దొరికాయి. వీటి సమాచారం అందుకున్న పోలీసులు, శరీర భాగాల్ని స్వాధీనం చేసుకున్నారు. అవి ఎక్కడ్నుంచి వచ్చాయో తెలుసుకునేందుకు విచారణ ప్రారంభించారు. ఆ శరీర భాగాలు ఒక్క వ్యక్తివే అని, అవి స్వయం జోషి అనే యువకుడికి సంబంధించినవి అని గుర్తించారు. ఈ క్రమంలో అనేక కోణాల్లో విచారణ జరుపగా, తండ్రిపై అనుమానం వచ్చింది. అతడు సూరత్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

Sai Pallavi : బోనమెత్తిన సాయి పల్లవి.. వైరల్ అవుతున్న ఫొటో..

రైలు ఎక్కి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా, నిజం ఒప్పుకున్నాడు. తన కొడుకు మద్యానికి బానిస అవ్వడం వల్లే గొడవ జరిగిందని, ఈ క్రమంలో అతడు ప్రాణాలు కోల్పోయాడని, తప్పించుకునేందుకే ఇదంతా చేశానని చెప్పాడు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు కోర్టులో హాజరుపర్చి, అనంతరం జైలుకు తరలించారు.