Delhi NCR Air Pollution : ఢిల్లీ ఎన్సీఆర్ వాయు కాలుష్యంపై సుప్రీంలో విచారణ-29కి వాయిదా

ఢిల్లీ ఎన్సీఆర్ లో వాయు కాలుష్యం పై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. మరో రెండు మూడు రోజుల పాటు వాయు కాలుష్య నియంత్రణ చర్యలను కొనసాగించాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని కోరింది.

  • Updated on- November 24, 2021 / 01:11 PM IST

Delhi Ncr Air Pollution

Delhi NCR Air Pollution :  ఢిల్లీ ఎన్సీఆర్ లో వాయు కాలుష్యం పై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. మరో రెండు మూడు రోజుల పాటు వాయు కాలుష్య నియంత్రణ చర్యలను కొనసాగించాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని కోరింది.
Also Read : Job Cheating Gang Arrest : ఉద్యోగాల పేరిట మోసం చేస్తున్న ముఠా అరెస్ట్
ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై కాలుష్య స్థాయి 100కి చేరితే కొన్ని ఆంక్షలను ఎత్తివేయవచ్చన్న సుప్రీంకోర్టు తెలిపింది. పంజాబ్, హర్యానా ఉత్తరప్రదేశ్ లో పంట వ్యర్ధాల తొలగింపుకు అవలంభిస్తున్న విధానాలను తెలపాలని సుప్రీంకోర్టు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. తదుపరి విచారణను ధర్మాసనం నవంబర్ 29 వాయిదా వేసింది.