Hyderabad: బస్సులోంచి కిందపడి గాయాలపాలైన యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. మౌనిక (17) అనే యువతి హైదరాబాద్లోని ఒక ప్రైవేటు కళాశాలలో చదువుకుంటోంది. ఈ క్రమంలో నవంబర్ 1న ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తుండగా దిల్షుక్నగర్ వద్ద ప్రమాదానికి గురైంది.
Assam: పేరెంట్స్కు కంప్లైంట్ చేసినందుకు గర్భిణి అయిన టీచర్పై విద్యార్థుల దాడి
బస్సులో ప్రయాణికులు ఎక్కువగా ఉండటంతో, మౌనిక ఫుట్బోర్డుపై నిలబడింది. అయితే, ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. ఈ ఘటనలో బస్సు చక్రం ఆమె ఎడమకాలిపై నుంచి వెళ్లింది. దీంతో మౌనిక తీవ్రంగా గాయపడింది. తర్వాత ఆమెను వివిధ ఆస్పత్రుల్లో చేర్చి చికిత్స అందించారు. అయితే, మౌనిక కుటుంబ సభ్యులు పేదవాళ్లు కావడంతో చికిత్సకు డబ్బులు దొరకని పరిస్థితి. తీవ్ర అనారోగ్యంతో ఉన్న మౌనికకు ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్య సాయం అందించలేకపోయారు. దీంతో మౌనికను చికిత్స కోసం నాలుగు ఆస్పత్రులు తిప్పారు. ఈ క్రమంలో మౌనికకు ఇన్ఫెక్షన్ సోకింది. చివరకు నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ప్రాణాలు కోల్పోయింది.
Bengaluru: మద్యం మత్తులో ఉన్న యువతిపై బైక్ ట్యాక్సీ డ్రైవర్ అత్యాచారం.. మరో వ్యక్తితో కలిసి దురాగతం
ఇప్పటికే మౌనికకు చికిత్స అందించేందుకు ఆమె కుటుంబ సభ్యులు రూ.12 లక్షల వరకు అప్పు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ విషయంలో ఆర్టీసీ నుంచి ఎలాంటి సాయం అందలేదు. కుటుంబానికి ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదు. ఈ ఘటనపై అప్పట్లోనే మౌనిక చదువుతున్న కళాశాలకు చెందిన విద్యార్థులు ధర్నా చేశారు. ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు.