MLA Komatireddy : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పోడు భూముల సమస్యను పరిష్కరిస్తే రాజీనామా చేయడానికి కూడా తాను సిద్ధమని పేర్కొన్నారు. పోడు భూముల సమస్య పరిష్కారమైతే రాజీనామా చేసి మళ్లీ పోటీ కూడా చేయనన్నారు.
- bheemraj
- Published On : August 2, 2022 / 07:24 PM IST
MLA Komatireddy : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పోడు భూముల సమస్యను పరిష్కరిస్తే రాజీనామా చేయడానికి కూడా తాను సిద్ధమని పేర్కొన్నారు. పోడు భూముల సమస్య పరిష్కారమైతే రాజీనామా చేసి మళ్లీ పోటీ కూడా చేయనన్నారు.
రాజీనామాతోనే మునుగోడుకు నిధులు వస్తాయని తెలిపారు. ప్రజలకు న్యాయం చేయలేని పదవి ఎందుకు అన్నారు. నియోజవకర్గంలో ఏ అభివృద్ధి జరగలేదని విమర్శించారు. తాను అమ్ముడుపోయే వ్యక్తిని కాదని తెలిపారు.
Eetela Rajender : రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం పక్కా-ఈటల రాజేందర్
టీఆర్ఎస్ లో మంత్రి పదవి ఆఫర్ చేస్తేనే వదులుకున్నట్లు గుర్తు చేశారు. పోడు భూముల సమస్యపై త్వరలో ఆందోళన చేస్తానని చెప్పారు.
