Pawan Kalyan : గత కొద్దీ రోజులుగా పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఏపీలో ఉండే సమస్యలపై సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూనే ఉన్నారు. ఇటీవల రిపబ్లిక్ ఈవెంట్ లో కూడా ఏపీ ప్రభుత్వంపై గట్టిగానే వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పుడు ఏపీలో జనసేన వర్సెస్ వైసీపీ అన్నట్టు ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.
ఇదివరకే ఏపీలో రోడ్లు సరిగ్గా లేవని వాటిని తొందరగా మరమ్మత్తు చేయాలని పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. నెల రోజుల్లో పనులు మొదలు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. కానీ ఏపీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు. దీంతో మళ్ళీ ఆ సమస్యని బయటకి తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్. ఈ సారి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ఏపీ ప్రభుత్వానికి ఇచ్చిన గడువు అక్టోబర్ ఫస్ట్ తారీఖు వరకు ఉంది. ఈ లోపు రాష్ట్రంలో పాడయిన రోడ్ల మరమ్మత్తుని వెంటనే చేపట్టాలి అని లేదంటే అక్టోబర్ 2 నుంచి నేనే రోడ్ల పైకి వచ్చి మరమ్మత్తులు చేస్తానని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
Allu Arjun : అల్లు అర్జున్ కి 160 ఏళ్ళ పురాతన గిఫ్ట్ ఇచ్చిన మలయాళ వీరాభిమాని
దీనికి జనసేన పార్టీ ప్రణాళిక కూడా సిద్ధం చేసింది. ఒకవేళ ఏపీ ప్రభుత్వం పనులు మొదలు పెట్టకపోతే అక్టోబర్ 2న ఉదయం 10 గంటలకు రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజ్ పై పవన్ కళ్యాణ్ స్వయంగా రోడ్లను మరమ్మత్తు చేస్తారని తెలిపారు. ఆ తర్వాత అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు అనంతపురం జిల్లా కొత్త చెరువులో రోడ్లు మరమ్మత్తు చేస్తారని తెలిపారు. అదే రోజు అన్ని మండలాల్లో జనసేన కార్యకర్తలు, నాయకులు కూడా రోడ్ల మరమ్మత్తులు చేస్తారని జనసేన పార్టీ తెలిపింది. జరుగుతున్న వరుస పరిణామాలు చూస్తుంటే పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని గట్టిగానే ఢీ కొట్టడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది.