Traffic Restrictions
Hyderabad: విపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా రేపు హైదరాబాద్ రానున్నారు. ఆయన బేగంపేట విమానాశ్రయం నుంచి జలవిహార్ వరకు ర్యాలీ చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు రేపు ఆయా మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ట్రాఫిక్ మళ్ళింపులు ఉంటాయని చెప్పారు. బేగంపేట్ విమానాశ్రయం–లైఫ్ స్టైల్ భవన సముదాయం– సోమాజిగూడ – ఖైరతాబాద్ – ఐమ్యాక్స్ రోటరీ – నెక్లెస్ రోడ్ – జలవిహార్ నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావచ్చు. దీంతో ట్రాఫిక్ రద్దీగా ఉండొచ్చు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అవసరమైతే ట్రాఫిక్ను మళ్ళిస్తామని పోలీసులు తెలిపారు.
Maharashtra: 4న మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్షకు దిగుతున్న ఏక్నాథ్ షిండే
Maharashtra: ఇదే పని రెండున్నరేళ్ళ క్రితం బీజేపీ ఎందుకు చేయలేదు?: ఉద్ధవ్ ఠాక్రే
అలాగే పెద్ద సంఖ్యలో రాజకీయ నాయకులు బేగంపేట విమానాశ్రయం నుంచి పంజాగుట్ట-కేబీఆర్ పార్క్-జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్- రోడ్ నంబరు.36-మాదాపూర్ మీదుగా ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య హెచ్ఐసీసీ నోవాటెల్, మాదాపూర్కు తరలివెళ్లే అవకాశం ఉంది. దీంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఉండొచ్చు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్ళాలని, తమకు సహకరించాలని పోలీసులు సూచించారు.