Goodachari 2 : మగధీర లొకేషన్స్ లో గూఢచారి 2 షూటింగ్..
అడివి శేష్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ గూఢచారి 2 షూటింగ్ మగధీర లొకేషన్స్ లో జరుగుతుంది.
Goodachari 2 : అడివి శేష్ హీరోగా 2018లో ఆడియన్స్ ముందుకు వచ్చి థ్రిల్ చేసిన స్పై యాక్షన్ మూవీ ‘గూఢచారి’. టాలీవుడ్ లోనే ఈ సినిమా బెస్ట్ స్పై యాక్షన్ చిత్రంగా నిలిచింది. శశి కిరణ్ టిక్క డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అడివి శేష్ ఇవ్వడం విశేషం. ఇక ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాదు.. జేమ్స్ బాండ్ సిరీస్ లా ఆ మూవీ కూడా ఫ్రాంచైస్ గా ఉంటే బాగుండు అనే భావన ఆడియన్స్ లో కలిగించింది.
ఇక సీక్వెల్ పై ఆడియన్స్ లో కనిపించిన ఆసక్తిని చూసి అడివి శేష్ కూడా గూఢచారి 2ని ప్రకటించేసారు. ఈసారి టాలీవుడ్ సినిమాగా కాకుండా పాన్ ఇండియా చిత్రంగా తీసుకు రాబోతున్నారు. ఆల్రెడీ షూటింగ్ కూడా స్టార్ట్ చేసారు. అడివి శేష్ నటించిన ‘మేజర్’ సినిమాకి ఎడిటర్ గా పని చేసిన వినయ్ కుమార్.. ఈ సీక్వెల్ ని డైరెక్ట్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ బనితా సంధు హీరోయిన్ గా, ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నారు.
Also read : Ruhani Sharma : విరాట్ కోహ్లీ మీ సినిమాలు చూస్తారా.. రుహాణి ఏం చెప్పింది..!
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ గుజరాత్ లోని మగధీర లొకేషన్స్ లో జరుగుతుంది. మగధీర సినిమాలో ఉప్పు ఎడారిలో గుర్రపు పోటీ అందరికి గుర్తుకు ఉండే ఉంటుంది. ఆ లొకేషన్ లోనే ఇప్పుడు గూఢచారి 2 షూటింగ్ కూడా జరుగుతుంది. మూవీలోని పలు కీలక సన్నివేశాలను అక్కడ షూట్ చేస్తున్నారు. ఈ షూటింగ్ లో బనితా సంధు కూడా పాల్గొన్నారు. ఆ షూటింగ్ సెట్స్ లో ఆమె తీసుకున్న సెల్ఫీని మూవీ టీం షేర్ చేస్తూ షూటింగ్ అప్డేట్ ని ఇచ్చారు.
A new schedule of #G2 begins in Bhuj, Gujarat 🔥@AdiviSesh & #BanitaSandhu are going to shoot for some key scenes during this schedule 💥@emraanhashmi @vinaykumar7121 @peoplemediafcy @AAArtsOfficial @vishwaprasadtg @abburiravi @vivekkuchibotla @MayankOfficl @SricharanPakala… pic.twitter.com/36iR1tCnXz
— Abhishek Agarwal 🇮🇳( Modi Ka Parivar) (@AbhishekOfficl) March 29, 2024
కాగా ఈ చిత్రాన్ని G2 టైటిల్ తో ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. మరి ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ షూటింగ్ ని ఎప్పుడు పూర్తి చేసి ఎప్పుడు థియేటర్స్ లోకి తీసుకు వస్తారో చూడాలి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.