Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ ‘పుష్ప:ది రైజ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా తెరకెక్కించగా, ఈ సినిమాలో పుష్పరాజ్ పాత్రలో బన్నీ పర్ఫార్మెన్స్ మరో లెవెల్లో ఉండటంతో, ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్తో ఈ సినిమాకు సీక్వెల్ను రెడీ చేసే పనిలో బన్నీ అండ్ టీమ్ ఉన్నారు.
Allu Arjun : అల్లు అర్జున్ ఫేవరేట్ ఫుడ్ ఏంటో తెలుసా?? అందరికి చెప్పేసిన స్నేహరెడ్డి..
ఇప్పటికే స్క్రిప్టు పనుల్లో బిజీగా ఉన్న చిత్ర యూనిట్, త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించి.. అంతే త్వరగా ఈ సినిమా షూటింగ్ను పూర్తి చేయాలని భావిస్తున్నారు. అయితే ఈ సినిమా తరువాత బన్నీ తన నెక్ట్స్ ప్రాజెక్టుల కోసం అప్పుడే స్క్రిప్టులు వింటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తమిళ దర్శకుడు ఏఆర్.మురుగదాస్ బన్నీకి ఓ స్టోరీలైన్ వినిపించగా, అది బన్నీకి బాగా నచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ స్క్రిప్టును డెవలప్ చేయాల్సిందిగా ఏఆర్.మురుగదాస్కు బన్నీ సూచించాడట.
Allu Arjun : ‘రాకీ భాయ్’ పై ‘పుష్ప’ స్పెషల్ ట్వీట్..
ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టును పూర్తి చేసే పనిలో మురుగదాస్ బిజీగా ఉన్నాడని.. త్వరలోనే ఈ స్క్రిప్టును పూర్తి చేసి బన్నీకి వినిపించాలని చూస్తున్నాడట. ఒక్కసారి బన్నీ ఈ కథను ఓకే చేస్తే.. భారీ పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను తెరకెక్కించాలని మురుగదాస్ ప్లాన్ చేస్తున్నాడట. అయితే గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో స్పైడర్ అనే ఫ్లాప్ మూవీని తెరకెక్కించిన మురుగదాస్కు టాలీవుడ్లో పెద్దగా మార్కెట్ లేదు. దీంతో ఆయనతో బన్నీ సినిమా చేస్తే రిస్క్ అవుతుందేమో అని బన్నీ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. మరి ఈ సినిమా నిజంగానే పట్టాలెక్కుతుందా లేదా అనేది చూడాలి.