షూటింగ్ షూరూ..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ల కాంబినేషన్లో రూపొందుతున్నసినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు (ఏప్రిల్ 24) నుండి స్టార్ట్ అయ్యింది..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ల కాంబినేషన్లో రూపొందుతున్నసినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు (ఏప్రిల్ 24) నుండి స్టార్ట్ అయ్యింది..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ల కాంబినేషన్లో, జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత ముచ్చటగా మూడవ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్.. ఎస్.రాధాకృష్ణ(చినబాబు), అల్లు అరవింద్ కలిసి నిర్మిస్తుండగా, డీజే తర్వాత రెండోసారి పూజా హెగ్డే బన్నీ పక్కన హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు (ఏప్రిల్ 24) నుండి స్టార్ట్ అయ్యింది.
హైదరాబాద్, బేగంపేట్లోని పోలీస్ లైన్లో షూటింగ్ ప్రారభమైంది. బొమన్ ఇరానీ, జయరామ్, టబు, సుశాంత్, నవదీప్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి ‘నాన్న-నేను’, ‘అలకనంద’ అనే పేర్లు వినబడుతున్నాయి. కెమెరా : పిఎస్ వినోద్, ఎడిటింగ్ : నవీన్ నూలి, సంగీతం : థమన్ ఎస్, ఆర్ట్ : ఎఎస్ ప్రకాష్.