Chinna Jeeyar Swamy : అఖండ 2 సినిమాని ప్రశంసించిన శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి..
అఖండ సినిమా చూసిన తర్వాత శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి దర్శకుడు బోయపాటి శ్రీనుని ఆశీర్వదించి సన్మానించారు.

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో విడుదలైన నాలుగో సినిమా ‘అఖండ–2’. సనాతన ధర్మం గురించి చెప్తూ తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల డిసెంబర్ లో రిలీజయి ప్రేక్షకులను మెప్పించింది.

ఇప్పటికే అనేకమంది హిందూ సంఘాలు, స్వామీజీలు ఈ సినిమాని చూసి అభినందించగా తాజాగా శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ త్రిదండి అహోబిలం స్వామి 400 మంది వేద పాఠశాల విధ్యార్థులతో కలిసి హైదరాబాద్లో అఖండ–2 సినిమాని చూసారు.

అఖండ సినిమా చూసిన తర్వాత దర్శకుడు బోయపాటి శ్రీనుని ఆశీర్వదించి సన్మానించారు.

సన్మానం తర్వాత శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి మాట్లాడుతూ.. ఎంతో బాధ్యతతో కూడిన సినిమాని తీశారని, మీరు తీసిన ఈ సినిమా ద్వారా హైందవ ధర్మాన్ని అందరికి అర్థమయ్యేలాగా, బలంగా చెప్పారని దర్శకుడు బోయపాటి శ్రీను ని ప్రశంసించారు.
