VN Aditya : అగ్ర నిర్మాణ సంస్థపై దర్శకుడు షాకింగ్ కామెంట్స్.. నా సినిమాలు ఎప్పుడు రిలీజ్..? నాలుగేళ్లుగా ఓపిక నశించి..

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ VN ఆదిత్య మాట్లాడుతూ.. నా సినిమా పూర్తయినా కూడా నిర్మాతలు రిలీజ్ చెయ్యట్లేదు అని కామెంట్స్ చేసారు.

VN Aditya : మనసంతా నువ్వే, నేనున్నాను, ఆట.. లాంటి మంచి హిట్ సినిమాలు అందించిన దర్శకుడు VN ఆదిత్య ప్రస్తుతం తన సినిమాల రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ VN ఆదిత్య మాట్లాడుతూ.. నా సినిమా పూర్తయినా కూడా నిర్మాతలు రిలీజ్ చెయ్యట్లేదు అని కామెంట్స్ చేసారు. తాజాగా టాలీవుడ్ లో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తమ మెయిన్ టీమ్ అంతా ఓ మీటింగ్ పెట్టుకొని ఆ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసారు.

అయితే దర్శకుడు VN ఆదిత్య ఆ ఫోటోని షేర్ చేస్తూ తన సోషల్ మీడియాలో.. లవ్ @65, మీరెవరు, మర్యాద క్రిష్ణయ్య.. మూడు మంచి సెన్సిబుల్ సినిమాలు మీ దగ్గర నుంచి రిలీజ్ అవ్వడం కోసం ఎదురుచూస్తున్నాను. PMFలో ఒక మూవీ రిలీజ్ చేయడానికి అవసరమైన జనాభా అంతా ఒకే ఫ్రేమ్ లో కూర్చున్నారు. కనీసం రిలీజ్ చేయాల్సిన నా మూడు సినిమాల గురించి ఒక మాటన్నా అనుకోవాలి కదా. అరక్షణం డిస్కషన్ అది. నాలుగేళ్లుగా నిరీక్షిస్తున్నా. ఇంక ఓపిక నశించి పబ్లిక్ లో అడుగుతున్నా అంటూ పోస్ట్ చేసారు. కామెంట్స్ కూడా చేసారు. వీటితో పాటు.. ఎక్కడి మానుష జన్మంబెత్తిన ఫలమేమున్నది.. నిక్కము నిన్నే నమ్మితి.. చిత్తంబికనూ.. నీ చిత్తంబికనూ..’ అనే అన్నమయ్య స్తోత్రం కూడా కామెంట్స్ లో రాసుకొచ్చారు.

Also Read : Kalki Bujji Vehicle : చిన్ని సైజ్ రోబోటిక్ ‘బుజ్జి’ని తయారుచేసిన ఇంజనీర్.. ఎలా చేయాలో కూడా చెప్పేసాడు.. .

దీంతో డైరెక్టర్ VN ఆదిత్య పోస్ట్, కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇలా ఒక అగ్ర నిర్మాణ సంస్థని తన సినిమాలు రిలీజ్ చేయమని వేడుకుంటూ పోస్ట్ పెట్టడం చర్చగా మారింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో VN ఆదిత్య దర్శకత్వంలో ఆల్రెడీ మూడు సినిమాలు షూటింగ్ అయిపోయి ఉన్నాయని, రిలీజ్ చేయకుండా నాలుగేళ్లుగా ఆపారని, అందుకే డైరెక్టర్ VN ఆదిత్య ఇలా బాధతో కామెంట్స్ పెట్టారని ఆయన సన్నిహితులు అంటున్నారు. ఒకప్పుడు మంచి సినిమాలు అందించిన VN ఆదిత్య ఇప్పుడు తాను తీసిన సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో అని నిర్మాతల నిర్ణయం కోసం ఎదురుచూడటం గమనార్హం.

ట్రెండింగ్ వార్తలు