Jani Master Wife went To Narsing Police Station for Jani Master Case
Jani Master Wife : జానీ మాస్టర్ ని గోవాలో పోలీసులు అదుపులోకి తీసుకొని హైదరాబాద్ కి తరలిస్తున్నారు. మహిళా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తో పాటు ఆమె భార్యపై కూడా కేస్ పెట్టింది. జానీ మాస్టర్ భార్య సైతం తనపై దాడి చేసిందని ఆ బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.
తాజాగా జానీ మాస్టర్ భార్య అయేషా నార్సింగి పోలీస్ స్టేషన్ కు వెళ్ళింది. ఇటీవల జానీ మాస్టర్ కి వచ్చిన ఫేక్ కాల్ పై సమాచారం తెలుసుకోవడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది జానీ భార్య. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ కేసుకు సంబంధించి ఆమెని మాట్లాడించడానికి మీడియా ప్రయత్నం చేసింది.
Also Read : Nagababu – Jani Master : నాగబాబు ట్వీట్.. జానీ మాస్టర్ ని ఉద్దేశించేనా..?
దీంతో నార్సింగి పోలీస్ స్టేషన్ వద్ద కొరియోగ్రాఫర్ జానీ భార్య అయేషా మీడియాపై ఫైర్ అయింది. నాకే కెమెరా పెడతారా మీపై కేసులు పెడతానంటూ మీడియాను బెదిరించింది జానీ మాస్టర్ భార్య అయేషా.