కరోనా కారణంగా షూటింగ్లు లేక ఒత్తిడులు కారణమో ఏమో తెలియవు కానీ.. మంచి భవిష్యత్తు ఉన్న నటులు సూసైడ్ చేసుకుని ఈ లోకం విడిచి వెళ్లిపోతున్నారు. ఈ ఏడాది సినిమా చరిత్రలో చీకటి సంవత్సరం అని కొందరు అంటున్నారు. ఇండియన్ సినిమా ప్రతిభావంతులైన కళాకారులను కోల్పోతోంది. ఇప్పటికే నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ను మిస్ అవుతున్న సినీ ప్రేమికులకు మరో యువనటుడు దూరమయ్యాడు.
కన్నడ సిరియల్ అంతుపురాలో నటించి మెప్పించిన సుశీల్.. ఫిట్నెస్ ట్రైనర్ కూడా. దునియా విజయ్ హీరోగా నటించిన సలాగా చిత్రంలో సుశీల్.. త్వరలో పోలీసు పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమా విడుదలకు ముందే సుశీల్ ప్రపంచానికి వీడ్కోలు పలికారు.
ఈ సినిమా హీరో దునియా విజయ్.. సోషల్ మీడియా పోస్టు ద్వారా సుశీల్ నిష్క్రమణపై ఆవేదన వ్యక్తం చేశారు. ‘నేను మొదట సుశీల్ను చూసినప్పుడు, అతను హీరో మెటీరియల్ అని అనుకున్నాను. అయితే సినిమా విడుదల కాకముందే ఆయన మమ్మల్ని విడిచిపెట్టారు. “ఆత్మహత్య అనేది ఏ సమస్యకైనా సమాధానం కాదు” అని ఆయన అన్నారు.
Read Here>>మహేశ్తో కామెడీ సీన్.. చాలా చీప్గా అనిపించిందంటోన్న బండ్ల గణేశ్