Evaru Meelo Koteeswarulu : మహేష్ ఎపిసోడ్కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకి సూపర్స్టార్ గెస్ట్గా వచ్చిన క్రేజీ ఎపిసోడ్ టెలికాస్ట్ డేట్ లాక్ చేశారు..
- sekhar
- Published On : October 27, 2021 / 12:57 PM IST
Ntr Mahesh
Evaru Meelo Koteeswarulu: సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకి గెస్ట్గా రాబోతున్నారనే వార్త కొద్ది రోజులుగా వైరల్ అవుతోంది. ఇద్దరూ షూటింగ్లో పాల్గొన్న పిక్ కూడా నెట్టింట వైరల్ అయ్యింది. దసరా లేదా దీపావళికి ఈ స్పెషల్ ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది అన్నారు కానీ తర్వాత దీని గురించిన ఊసే లేదు.
Prabhas : ఆ పిల్ల బాత్రూంలో నేనెందుకుంటాన్రా?..
కట్ చేస్తే మహేష్ ఎపిసోడ్ ఎప్పుడు రాబోతుందో ఓ క్లారిటీ వచ్చేసింది. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో నవంబర్ 18తో ముగియనుంది. లాస్ట్ ఎపిసోడ్గా మహేష్ ఎపిసోడ్ను ప్రసారం చేస్తే మంచి మైలేజ్తో పాటు హైయ్యస్ట్ టీఆర్పీ కూడా వచ్చే అవకాశముందని నిర్వాహకులు ఇలా ప్లాన్ చేశారు.
Shanmukh Jaswanth : వాళ్లిద్దరికీ ఇష్టమైతే మాక్కూడా ఇష్టమే
సినిమాల విషయానికొస్తే.. ఎన్టీఆర్, రామ్ చరణ్లతో రాజమౌళి రూపొందించిన ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం ‘ఆర్ఆర్ఆర్’ జనవరి 7న రిలీజ్కి రెడీ అవుతుండగా.. మహేష్ ‘సర్కారు వారి పాట’ జనవరి 12కి షెడ్యూల్ చేసుకుంది. రీసెంట్గా స్పెయిన్లో సాంగ్ షూటింగ్ కంప్లీట్ చేశారు టీం.
