నటుడు శరణ్(49) కన్నుమూత

మలయాళ నటుడు శరణ్ బుధవారం కన్నుమూశారు. ఆయన వయసు 49 సంవత్సరాలు.. గత కొన్ని రోజులుగా శరణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు, ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబసభ్యులు

Malayalam actor Sharan:మలయాళ నటుడు శరణ్ బుధవారం కన్నుమూశారు. ఆయన వయసు 49 సంవత్సరాలు.. గత కొన్ని రోజులుగా శరణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు, ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబసభ్యులు బుధవారం ఉదయం ఆసుపత్రికి తరలించారని సమాచారం. అయితే ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారని కుటుంబసభ్యులు తెలిపారు.

మోహన్ లాల్ నటించిన ‘చిత్రమ్’ లో నటుడిగా శరణ్ మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించడానికి కారణం తెలియరాలేదు. అకాల మరణం మలయాళ చిత్ర పరిశ్రమకు షాక్ ఇచ్చింది. శరణ్ మృతిపట్ల సూపర్ స్టార్ మోహన్ లాల్ సోషల్ మీడియాలో ఫోటో షేర్ చేసి నివాళి అర్పించారు. కాగా చిత్రమ్ హిట్ అయిన తరువాత, శరణ్ అనేక చిత్రాలలో నటించారు. అంతేకాదు కొన్ని చిత్రాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా పనిచేశారు.

ట్రెండింగ్ వార్తలు