Mani Ratnam: మణిరత్నం దర్శకత్వంలో విజయ్ సేతుపతి- సాయి పల్లవి.. మరో అద్భుతమైన ప్రేమ కథతో
దర్శకుడు మణిరత్నం(Mani Ratnam) విజయ్ సేతుపతి- సాయి పల్లవి జంటగా ప్రేమకథను తెరకెక్కించనున్నాడు.
- V Santhosh Kumar
- Published On : April 4, 2026 / 06:56 AM IST
Mani Ratnam next movie with Vijay Sethupathi, Sai Pallavi
- మరోసారి ప్రేమకథతో వస్తున్న మణిరత్నం
- విజయ్ సేతుపతి- సాయి పల్లవి జంటగా మూవీ
- గీతాంజలి మ్యాజిక్ రిపీట్ చేయనున్న మణిరత్నం
Mani Ratnam: ప్రముఖ దర్శకుడు మణిరత్నం గురించి, ఆయన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గీతాంజలి, దళపతి, బొంబాయి లాంటి చాలా గొప్ప గొప్ప కథలను వెండితెరపై ఆవిష్కరించారు. ఇక, హృద్యమైన ప్రేమకథలను చేయడంలో ఆయన తరువాతే ఎవరైనా. అయితే, గత కొంతకాలంగా ఆయన సినిమాలు ప్రేక్షకులను అలరించడం లేదు. అందుకే, కాస్త గ్యాప్ తీసుకొని మరోసారి అద్భుతమైన ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు.
ఈ క్రేజీ ప్రాజెక్టులో విజయ్ సేతుపతి- సాయిపల్లవి జంటగా నటించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబదించిన అధికారిక ప్రకటన ఇటీవలే వచ్చిన విషయం తెలిసిందే. త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లాలని చిత్రబృందం భావిస్తోంది. దీని కోసం ఈ నెలలోనే ఒక ప్రత్యేక ప్రోమో షూట్ను పూర్తి చేసి, వేసవి కానుకగా జూన్ నెలలో రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మద్రాస్ టాకీస్(Mani Ratnam), లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ రొమాంటిక్ డ్రామాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.
ప్రస్తుతం ఈ ఇద్దరు స్టార్స్ తమ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. విజయ్ సేతుపతి ‘స్లమ్ డాగ్’, ‘పాకెట్ నోవెల్’ వంటి చిత్రాల్లో నటిస్తుండగా, సాయిపల్లవి హిందీలో ‘రామాయణ’, ‘ఏక్ దిన్’ సినిమాలతో బిజీగా ఉంది. ఈ ప్రాజెక్టులు కంప్లీట్ అయిన వెంటనే మణిరత్నం సినిమా సెట్స్ లోకి అడుగుపెట్టనున్నారు. నిజానికి, విజయ్ సేతుపతి- సాయి పల్లవి కాంబినేషన్లో సినిమా అనగానే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మణిరత్నం శైలిలో సాగే ఈ ప్రేమకథ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మరి ఈ ప్రేమకథ గీతాంజలి రోజులను గుర్తు చేస్తుందా అనేది చూడాలి.
