నవంబర్ 1న ‘మీకు మాత్రమే చెప్తా’

తరుణ్ భాస్కర్‌, అనసూయ, అభినవ్ లీడ్ రోల్స్ చేస్తున్న 'మీకు మాత్రమే చెప్తా' నవంబర్ 1న గ్రాండ్‌ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : October 3, 2019 / 11:18 AM IST
నవంబర్ 1న ‘మీకు మాత్రమే చెప్తా’

Updated On : October 3, 2019 / 11:18 AM IST

తరుణ్ భాస్కర్‌, అనసూయ, అభినవ్ లీడ్ రోల్స్ చేస్తున్న ‘మీకు మాత్రమే చెప్తా’ నవంబర్ 1న గ్రాండ్‌ రిలీజ్..

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి,  డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌ను హీరోగా పరిచయం చేస్తూ, ‘మీకు మాత్రమే చెప్తా’ అనే సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.. అభినవ్, అనసూయ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా షమ్మీర్ సుల్తాన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

ఇటీవల రిలీజ్ చేసిన పోస్టర్స్ అండ్ లిరికల్ సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్‌గా ‘మీకు మాత్రమే చెప్తా’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. పక్కా ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘మీకు మాత్రమే చెప్తా’ నవంబర్ 1న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

Read Also : చాణక్య – సెన్సార్ పూర్తి..

పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, వాణి భోజన్, అవంతిక మిశ్రా, వినయ్ వర్మ తదితరులు ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. మ్యూజిక్ : శివకుమార్, సినిమాటోగ్రఫీ : మదన్ గుణదేవా, ఆర్ట్ : రాజ్‌కుమార్, లైన్ ప్రొడ్యూసర్ : విజయ్ మట్టపల్లి, నిర్మాతలు : విజయ్ దేవరకొండ, వర్ధన్ దేవరకొండ..