మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైంది. మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. గుంటూరుకు చెందిన జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఇటీవలే వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో సోమవారం పసుపు దంచే కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీకి చెందిన మహిళలందరూ హాజరయ్యారు.
నిహారిక కూడా పసుపు దంచుతూ ఫొటోలకు ఫోజులిచ్చింది. ఆ వీడియోను నిహారిక తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్లో నిహారిక పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేసినట్టు సమాచారం. అయితే ముహూర్తానికి సంబంధించి ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి అధికారిక సమాచారమూ లేదు.