NTR is chief guest for Siddhu Jonnalagadda Tillu Square success event
Tillu Square : సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ లో డీజే టిల్లుకి సీక్వెల్ గా రూపొందిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. మల్లిక్ రామ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్స్ గా నటించారు. మంచి అంచనాలతో రిలీజైన ఈ చిత్రం.. మొదటి షోతోనే బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇంకేముంది థియేటర్స్ లో టిల్లు గాడి డీజే గట్టిగా మోగడం స్టార్ట్ అయ్యింది.
దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ కూడా మొదలయ్యి.. మొదటి మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించేసింది. ఇప్పటివరకు 85 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు అందుకున్న ఈ చిత్రం నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్ కి లాభాలు తెచ్చిబెడుతూ ముందుకు సాగుతుంది. ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో చిత్ర యూనిట్ ఫుల్ జోష్ లో ఉంది. దీంతో ఓ సక్సెస్ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారు.
Also read : Ranveer Singh : మీ స్టార్డమ్ ఏంటి.. మీరు చేసే యాడ్స్ ఏంటి.. జానీ సిన్స్తో రణ్వీర్ కొత్త యాడ్ చూశారా..
ఇక ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ రాబోతున్నారట. డీజే టిల్లు నుంచే ఎన్టీఆర్ ఈ సినిమాకి పెద్ద ఫ్యాన్. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో ఈ విషయాన్ని స్వయంగా ఎన్టీఆరే చెప్పుకొచ్చారు. ఇక ఈ మూవీకి సీక్వెల్ రావడంతో.. సినిమాని చూసి ఫుల్ గా ఎంజాయ్ చేశారు. దీంతో రీసెంట్ గా సిద్ధూని, నిర్మాత నాగవంశీని తన ఇంటికి పిలిపించుకొని మరి అభినందించారు.
Success event ki @tarak9999 anna vachela vunnadu anukunta 🧐
Confirmation @vamsi84 ivvochu ga anna#TilluSquare#Throwback video pic.twitter.com/3AKdbDwWg6
— poorna_choudary (@poornachoudary1) April 3, 2024
ఇందుకు సంబంధించిన ఫోటోలను సిద్ధూ జొన్నలగడ్డ షేర్ చేస్తూ.. “బిగ్ సర్ప్రైజ్ ఈజ్ కమింగ్” అంటూ కామెంట్ చేశారు. ఆ సర్ప్రైజ్ సక్సెస్ మీట్ కి ఎన్టీఆర్ గెస్ట్ అని సమాచారం. ఫిలిం వర్గాల్లోని పలువురు ఈ వార్తని కన్ఫార్మ్ చేస్తున్నారు. మరి మూవీ టీం నుంచి కూడా ఓ క్లారిటీ వచ్చేస్తే.. టిల్లు గాడితో టోనీని చూసేందుకు ఫ్యాన్స్ సిద్ధమవుతారు.