డ్రగ్స్ కేసులో ఎన్సీబీ ముందుకు రకుల్ ప్రీత్ సింగ్.. ఫోటోలు!

Rakul Preet Singh: స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ముంబై చేరుకున్నారు. మాదకద్రవ్యాల కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) ముందు ఆమె హాజరయ్యారు.
ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ ఎన్సిబి ముందు విచారణలో పాల్గొన్నారు. ఈ సంధర్భంగా రకుల్ ప్రీత్ సింగ్ నల్ల గాగుల్స్ మరియు మాస్క్ ధరించి ఎన్సిబి కార్యాలయానికి వచ్చారు.
సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో డ్రగ్స్ కేసు వెలువడిన తరువాత, ఎన్సిబి నటి రకుల్ ప్రీత్ సింగ్ను విచారించనుంది. ఎన్సిబి ప్రశ్నలకు రకుల్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. రకుల్ ప్రీత్ సింగ్తో పాటు దీపికా పదుకొనే, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్లకు కూడా ఎన్సిబి సమన్లు పంపింది. వారిని కూడా ఎన్సిబి విచారించబోతుంది.