Ram Charan : వామ్మో ఆ జనాలు ఏందిరా బాబు.. కడపలో రామ్ చరణ్.. భారీగా వచ్చిన ఫ్యాన్స్.. ఫోటోలు, వీడియోలు వైరల్..

ప్రస్తుతం కడప దర్గాలో 80వ జాతీయ ముషైరా గ‌జ‌ల్ ఈవెంట్‌ జరుగుతుండటంతో చ‌ర‌ణ్‌ హాజరయ్యాడు.

Ram Charan Visits Kadapa Dargah So Many Fans Welcomed

Ram Charan : రామ్ చరణ్ త్వరలో సంక్రాంతికి గేమ్ ఛేంజర్ సినిమాతో రాబోతున్నాడు. తాజాగా చరణ్ కడప దర్గాను సందర్శించాడు.

గతంలో ఎఆర్‌ రెహ్మాన్‌ క‌డ‌ప ద‌ర్గాలో జరిగే 80వ జాతీయ ముషైరా గ‌జ‌ల్ ఈవెంట్‌కు హాజరవ్వమని రామ్ చరణ్ ని కోరాడు. దీంతో చరణ్ వస్తానని మాట ఇచ్చాడు.

ప్రస్తుతం కడప దర్గాలో 80వ జాతీయ ముషైరా గ‌జ‌ల్ ఈవెంట్‌ జరుగుతుండటంతో చ‌ర‌ణ్‌ హాజరయ్యాడు.

ప్రస్తుతం చరణ్ అయ్యప్ప మాలలో ఉండగా నిన్న సాయంత్రం కడప వెళ్లారు. అభిమానులు భారీ సంఖ్యలో హాజరయి కడప ఎయిర్ పోర్ట్ నుంచి చరణ్ కు స్వాగతం పలికారు.

కడప సిటీలో చరణ్ కు గజమాలతో సత్కరించారు. చరణ్ వెంటే వేలాది మంది ఫ్యాన్స్ వచ్చారు.

కడపలో అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్న రామ్ చరణ్ అనంతరం కడప దర్గాను సందర్శించారు.

చరణ్ తో పాటు డైరెక్టర్ బుచ్చిబాబు సాన కూడా కడప దర్గాకు వెళ్లారు.

మగధీర ముందు కూడా రామ్ చరణ్ కడప దర్గాకు వెళ్లారు ఆ సినిమా చరణ్ కెరీర్లో పెద్ద హిట్ గా నిలిచింది. ఇప్పుడు గేమ్ ఛేంజర్ సినిమా ముందు కూడా కడప దర్గాకు వెళ్లడంతో ఈ సినిమా కుడా పెద్ద హిట్ అవుతుందని అంటున్నారు ఫ్యాన్స్.

చరణ్ ఏఆర్ రహమాన్ కు ఇచ్చిన మాట ప్రకారం మాలలో ఉన్నా కూడా కడప దర్గాకు రావడం గమనార్హం. చరణ్ కోసం అన్ని వేల మంది అభిమానులు రావడంతో ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్ గా మారాయి.