Renu Desai : పిల్లలతో శివరాత్రి జాగారణ చేయించిన రేణుదేశాయ్.. ఇది మన బాధ్యత అంటూ..

నిన్న మహా శివరాత్రి నాడు అందరూ ఉపవాసం, జాగారణ చేస్తారని తెలిసిందే. రేణు దేశాయ్ కూడా ఉపవాసం, జాగారణ చేసింది. తన పిల్లలు అకిరా, ఆద్యలతో కూడా ఉపవాసం, జాగారణ చేయించింది

Renu Desai : పిల్లలతో శివరాత్రి జాగారణ చేయించిన రేణుదేశాయ్.. ఇది మన బాధ్యత అంటూ..

Renu Desai Akira Nandan and Aadya fasting and awake on Maha Shivaratri

Renu Desai : పవన్ పిల్లలుగా అకిరా నందన్(Akira Nandan), ఆద్య(Aadya) అందరికి తెలుసు. వీళ్ళ గురించి చిన్న వార్త వచ్చినా, ఫొటోలు బయటకి వచ్చినా వైరల్ అవుతారు. అకిరా, ఆద్య ఇద్దరూ తల్లి దగ్గరే ఉంటున్నారు. అప్పుడప్పుడు పండగలకు మాత్రం మెగా ఫ్యామిలీతో కనపడతారు. ఇక రేణు దేశాయ్ సోషల్ మీడియాలో వీళ్ళ గురించి ఏ పోస్ట్ పెట్టినా వైరల్ అవ్వాల్సిందే. తాజాగా శివరాత్రి స్పెషల్ పోస్ట్ చేసింది రేణు దేశాయ్.

నిన్న మహా శివరాత్రి నాడు అందరూ ఉపవాసం, జాగారణ చేస్తారని తెలిసిందే. రేణు దేశాయ్ కూడా ఉపవాసం, జాగారణ చేసింది. తన పిల్లలు అకిరా, ఆద్యలతో కూడా ఉపవాసం, జాగారణ చేయించింది. రాత్రికి సద్గురు లైవ్ షో చూస్తూ ఓం నమః శివాయ అంటూ అకిరా, ఆద్య కూర్చొని దైవ స్మరణ చేస్తూ జాగారణ చేశారు. ఇది వీడియో తీసి రేణు దేశాయ్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Also Read : Ram Charan : ఉమెన్స్ డే రోజు అమ్మ కోసం స్పెషల్ వంట చేసిన చరణ్.. ఏమేమి వండాడో తెలుసా? పక్కన ఉపాసన ఏమో..

ఈ వీడియోని పోస్ట్ చేస్తూ.. ఆద్య, అకిరా నాతో కూర్చొని మెడిటేషన్ చేస్తూ జాగరణ చేశారు. పేరెంట్స్ గా మన కల్చర్ గురించి చెప్పి వాళ్ళని బాధ్యత గల వ్యక్తులుగా చేయడం మన బాధ్యత. వీరిద్దరూ ఉదయం నుంచి కేవలం వాటర్ తాగి ఉపవాసం ఉన్నారు. నేను మాత్రం మెడిసిన్ వేసుకోవాలి కాబట్టి బ్రేక్ ఫాస్ట్ తిన్నాను అని పోస్ట్ చేసింది. దీంతో ఇలా మన పండగల గురించి పిల్లలకు చెబుతున్నందుకు రేణు దేశాయ్ ని, అవి పాటిస్తున్నందుకు అకిరా, ఆద్యలను అభినందిస్తున్నారు.

View this post on Instagram

A post shared by renu desai (@renuudesai)