Ruhani Sharma : విరాట్ కోహ్లీ మీ సినిమాలు చూస్తారా.. రుహాణి ఏం చెప్పింది..!

రుహాణి శర్మ బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మకి చెల్లి అవుతుందని అందరికి తెలిసిందే. విరాట్ కోహ్లీ మీ సినిమాలు చూస్తారా అనే ప్రశ్నకు..

Ruhani Sharma : చిలసౌ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన రుహాణి శర్మ.. తెలుగులో వరుస సినిమాలు చేస్తూ వస్తున్నారు. కేవలం హీరోయిన్ గానే కాకుండా పలు ముఖ్య పాత్రలు కూడా చేస్తూ ఆడియన్స్ ని రెగ్యులర్ గా పలకరిస్తున్నారు. తాజాగా ఈ హీరోయిన్ నటించిన ‘శ్రీరంగ నీతులు’ మూవీ ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమవుతుంది. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో జరిగింది.

కాగా రుహాణి శర్మ బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మకి చెల్లి అవుతుందని అందరికి తెలిసిందే. ఈ విషయం ఇటీవలే అందరికి తెలిసింది. ఇక నేడు జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రుహాణి శర్మని.. “విరాట్ కోహ్లీ మీ బావగారు కదా. ఆయన మీ సినిమాలు చూస్తారా” అని ప్రశించారు. దీనికి రుహాణి బదులిస్తూ.. “ఈ ప్రశ్నకు నేను సమాధానం ఇవ్వలేను అండి. మీరు ఈ సినిమా గురించి అడగండి చెబుతాను” అని సున్నితంగా తిరస్కరించారు.

Also read : Neha Shetty : మొన్న సాయి దుర్గ తేజ్.. నేడు నేహా శెట్టి.. ప్రభాస్ విషయమే క్లారిటీ రావాలి..

అయితే ఈ వీడియో మాత్రం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. కాగా గతంలో రుహాణిని అనుష్క, విరాట్ గురించి ప్రశ్నించినప్పుడు, ఆమె బదులిస్తూ.. “విరాట్ కోహ్లీ చాలా మంచివాడు. నాతో బాగానే ఉంటాడు. వాళ్లిద్దరూ అందరితో చాలా మంచిగా ఉంటారు. ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా సింపుల్ గా నడుస్తారు. అందుకే వాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం” అంటూ చెప్పుకొచ్చారు.

ఇక శ్రీరంగ నీతులు సినిమా విషయానికి వస్తే.. ఈ మూవీ స్టోరీ నాలుగు పాత్రల చుట్టూ తిరుగుతుందని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది. ఈ నాలుగు పాత్రలని సుహాస్, రుహాణి శర్మ, విరాజ్ అశ్విన్, కార్తీక్ రత్నం పోషిస్తున్నారు. రుహాణి శర్మ, విరాజ్ అశ్విన్ కథ ప్రేమ అయితే.. సుహాస్ పాత్ర ఫేమస్ అవ్వడం, కార్తీక్ రత్నం పాత్ర డిప్రెషన్ కి సంబంధించింది. ట్రైలర్ అయితే ఆకట్టుకునేలా ఉంది.

ట్రెండింగ్ వార్తలు