Sonu Sood Twitter: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైన నాటి నుంచి పేదలకు, మధ్య తరగతి ప్రజలకు సహాయం చేస్తూ రియల్ హీరో అనిపించుకున్నారు సోనూ సూద్. ఇప్పటికీ ఆపదలో ఉన్నవారికి తనవంతు సాయాన్ని అందిస్తూ రియల్ హీరోగా మారారు సోనూ సూద్.
ఇటీవల పంజాబ్ స్టేట్ ఐకాన్గా నియమితులైన సోనూ సూద్ తాజాగా మరో ఘనత సాధించారు. ట్విట్టర్ ఫాలోయింగ్లో బాలీవుడ్ సూపర్స్టార్లను సైతం వెనక్కి నెట్టేసి నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
సోషల్ మీడియా అనలిటిక్స్ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. భారత్లో అత్యధిక ఫాలోయింగ్ (ట్విట్టర్) కలిగిన వ్యక్తుల జాబితాలో సూనూ సూద్ నాలుగో స్థానంలో ఉన్నారు. ఈ లిస్టులో భారత ప్రధాని మోడీ అగ్రస్థానంలో నిలిచారు.
ఆ తరువాత రాహుల్ గాంధీ, విరాట్ కోహ్లీలతో పాటు సోనూ సూద్ కూడా ఉన్నారు. ఫాలోయింగ్ విషయంలో షారుఖ్, సల్మాన్, ఆమీర్ ఖాన్ వంటి బాలీవుడ్ సూపర్స్టార్లందరినీ సోనూ సూద్ వెనక్కి నెట్టేయడం విశేషం.