Suhas : నా సినిమాలు మౌత్ టాక్ తోనే ఆడతాయి.. సుహాస్ ‘ప్రసన్నవదనం’ రిలీజ్ రేపే..

ప్రసన్న వదనం సినిమా రేపు మే 3న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.

Suhas : నా సినిమాలు మౌత్ టాక్ తోనే ఆడతాయి.. సుహాస్ ‘ప్రసన్నవదనం’ రిలీజ్ రేపే..

Suhas Interesting Comments in Prasanna Vadanam Release Press Meet

Suhas : వరుస హిట్స్ తో దూసుకుపోతున్న సుహాస్ ఇప్పుడు ‘ప్రసన్న వదనం’ సినిమాతో రాబోతున్నాడు. సుకుమార్ శిష్యుడు అర్జున్ వైకె దర్శకత్వంలో జెఎస్ మణికంఠ, టిఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మాణంలో సుహాస్ హీరోగా, పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్స్ గా ప్రసన్న వదనం సినిమా రాబోతుంది. ఫేస్ బ్లైండ్ నెస్ అనే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా రాబోతుంది. ఇప్పటికే విడుదలయిన టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రసన్న వదనం సినిమా రేపు మే 3న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.

తాజాగా రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించగా మూవీ యూనిట్ అంతా పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ లో హీరో సుహాస్ మాట్లాడుతూ.. ఈ సినిమా మే 3న రిలీజ్ కాబోతుంది. నేను ఆల్రెడీ ఫస్ట్ కాపీ చూసేసాను. థౌజండ్ పర్సెంట్ బ్లాక్ బస్టర్ సినిమా ఇది. ఇందులో డౌట్ లేదు. నా సినిమాలు సాధారణంగా మౌత్ టాక్ వలనే ఆడతాయి కాబట్టి అందరూ వీలైనంత త్వరగా థియేటర్ కి వెళ్లి సినిమా చూసి మిగతా వాళ్లకి ఎలా ఉందో చెప్పండి. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ ఇది అని తెలిపారు.

ఇక డైరెక్టర్ అర్జున్ మాట్లాడుతూ.. ఇది డైరెక్టర్ గా నా ఫస్ట్ సినిమా. థియేటర్స్ లో ఈ సినిమాని చూడటానికి ఎదురుచూస్తున్నాను. ఒక యూనిక్ కాన్సెప్ట్ తో రియల్ కమర్షియల్ సినిమా ఇది. ఫన్, థ్రిల్, రొమాన్స్, ఎమోషన్స్.. అన్ని ఉన్నాయి అని తెలిపారు.

Suhas Interesting Comments in Prasanna Vadanam Release Press Meet

నిర్మాత మణికంఠ మాట్లాడుతూ.. ఈ సినిమా రిలీజ్ కి ముందే మేము ప్రాఫిట్స్ లోకి వచ్చేసాము. బిజినెస్ బాగా జరిగింది. అంత బాగుంది ఈ సినిమా. ఇప్పటివరకు చూసిన వాళ్లంతా బాగుందని చెప్పారు అని అన్నారు. ఇక ఈ ప్రెస్ మీట్ లో మరో నిర్మాత ప్రసాద్ రెడ్డి, హీరోయిన్స్ రాశి సింగ్, పాయల్ రాధాకృష్ణ, మరికొంతమంది మూవీ యూనిట్ పాల్గొన్నారు.