Uday Kiran : నా కడుపున పుట్టుంటే.. ఉదయ్ కిరణ్ బ్రతికి ఉండేవాడేమో.. ఎమోషనలైన నటి..

ఉదయ్ కిరణ్ ఫోటో పట్టుకొని కన్నీరు మున్నీరు అయిన టాలీవుడ్ నటి. ఒకవేళ వాడు నా కడుపున పుట్టుంటే ఇంకా బ్రతికి ఉండేవాడేమో అంటూ..

Uday Kiran : తెలుగు హీరో ఉదయ్ కిరణ్ చనిపోయి ఏళ్ళు గడుస్తున్నా.. అతని మాత్రం టాలీవుడ్ ఆడియన్స్, తోటి కళాకారులు మర్చిపోలేక పోతున్నారు. ఏదొక సమయంలో అతనిని తలుచుకుంటూ బాధ పడుతూనే ఉంటున్నారు. తాజాగా టాలీవుడ్ సీనియర్ నటి ‘సుధా’ ఉదయ్ కిరణ్ ని తలుచుకొని కన్నీరు పెట్టుకున్నారు. దసరా నవరాత్రులు సందర్భంగా ఒక ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ లో ప్రసారమయ్యే ఒక స్పెషల్ షోకి ఈమె అతిథిగా వచ్చారు. ఈ షోలోనే ఉదయ్ కిరణ్ ఫోటో పట్టుకొని కన్నీరు మున్నీరు అయ్యారు సుధా.

ఉదయ్ కిరణ్ నటించిన పలు సినిమాల్లో సుధా కూడా నటించారు. కొన్ని సినిమాల్లో ఉదయ్ కిరణ్ కి తల్లిగా కూడా కనిపించారు. ఇక అందరికి చాలా దగ్గరయ్యే ఉదయ్ కిరణ్.. నటి సుధాకి కూడా అంతే దగ్గర అయ్యాడు. ఈ షోలో ఒక సందర్భంలో ఉదయ్ కిరణ్ ని తలుచుకుంటూ.. ‘ఒకవేళ వాడు నా కడుపున పుట్టుంటే ఇంకా బ్రతికి ఉండేవాడేమో’ అంటూ కన్నీరు మున్నీరు అయ్యారు. ఆమెతో పాటు షోలో వారు కూడా ఎమోషనల్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.

Also read : RRR : జర్మన్ యూనిటీ డే సెలబ్రేషన్స్‌లో ఆర్ఆర్ఆర్ టీం.. చరణ్ వీడియోతో.. కానీ ఎన్టీఆర్..!

కాగా ఇటీవల సీనియర్ నటుడు మురళి మోహన్ ఉదయ్ కిరణ్ గురించి మాట్లాడుతూ.. ఒక సూపర్ హిట్ సినిమా మిస్ చేసుకున్నట్లు తెలియజేశాడు. మహేష్ బాబు నటించిన అతడు సినిమా ఉదయ్ కిరణ్ చేయాల్సిందట. మురళి మోహన్ నిర్మించిన ఈ సినిమా కథని త్రివిక్రమ్ ముందుగా ఉదయ్ కిరణ్ కే వినిపించాడట. తను కూడా ఒకే చెప్పాడు, ఉదయ్ తెరకెక్కించడానికి మేకర్స్ కూడా సిద్ధమయ్యారు. అయితే ఉదయ్ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆ మూవీ మిస్ అయ్యింది. దీంతో ఉదయ్ నుంచి మహేష్ దగ్గరకి ఆ సినిమా వెళ్ళింది.

 

ట్రెండింగ్ వార్తలు