Vijayendra Prasad: మహేష్ మూవీపై బాంబ్ పేల్చిన జక్కన్న తండ్రి

స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి ఇటీవల ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి తన స్టామినా ఏమిటో....

Vijayendra Prasad: స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి ఇటీవల ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి తన స్టామినా ఏమిటో కూడా చూపించాడు ఈ డైరెక్టర్. ఇక ఇప్పుడు ఆయన తన నెక్ట్స్ మూవీ కోసం రెడీ అవుతున్నాడు. టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుతో కలిసి తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన జక్కన్న, ప్రస్తుతం స్క్రిప్టు పనుల్లో యమబిజీగా ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తూ వచ్చాయి.

Vijayendra Prasad : ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కి సీక్వెల్ ఉంది.. కథ కూడా చెప్పాను

ఇక ఈ సినిమాకు కూడా జక్కన్న ఆస్థాన రచయిత విజయేంద్ర ప్రసాద్ అదిరిపోయే కథను రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఓ ఇంటర్వ్యూలో జక్కన్న ఇప్పటికే స్క్రిప్టు పనులు చివరిదశకు చేరుకున్నాయని.. త్వరలోనే ప్రీ-ప్రొడక్షన్ పనులు ముగించుకుంటామని చెప్పాడని మహేష్ ఫ్యాన్స్ నానా హంగామా చేస్తూ వచ్చారు. అయితే ఈ సినిమాకు కథను అందిస్తున్న విజయేంద్ర ప్రసాద్ దగ్గర్నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. ఇంకా రాజమౌళి ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టును ఫైనల్ చేయలేదని.. దీనికి చాలా సమయం పడుతుందని ఆయన అన్నారట.

Vijayendra Prasad : ఎన్టీఆర్, చరణ్ కొట్టుకుంటుంటే నాకు ఏడుపొచ్చింది

దీంతో జక్కన్న ఈ సినిమా కథను ఎప్పుడు పూర్తి చేస్తాడు.. తమ హీరోతో ఎప్పుడు సినిమాను పట్టాలెక్కిస్తాడు.. ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తాడా అని మహేష్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కే ఛాన్స్ మాత్రం అస్సలు లేదనేది కన్ఫం. మహేష్ కూడా అతి త్వరలో మరో దర్శకుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తన నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతుండటంతో, జక్కన్నతో సినిమా పట్టాలెక్కడం అంటే వచ్చే ఏడాది వరకు ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు.

ట్రెండింగ్ వార్తలు