టాలీవుడ్ మాటల మాంత్రికుడు ‘త్రివిక్రమ్ శ్రీనివాస్’, స్టైలిష్ స్టార్ ‘అల్లు అర్జున్’ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుందన్న వార్తతో అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎప్పుడు ప్రారంభోత్సవం జరుగుతుందా ? సెట్టింగ్లోకి ఎప్పుడు వెళుతుందా ? అనే తెగ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. వీరి ఆతృతను గుర్తించిన హరిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్ ఓ ట్వీట్ చేసింది. ఈ సినిమాను రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.
బన్నీ – త్రివిక్రమ్ కాంబినేషన్పై ఫ్యాన్స్తో పాటు తాము కూడా చాలా ఆతృతగా ఉన్నామని హరిక అండ్ హాసిని క్రియేషన్స్ మార్చి 28వ తేదీ గురువారం ట్వీట్ చేసింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు..దీనికారణంగా సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేకపోతున్నట్లు తెలిపారు. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం అంటూ తెలిపారు.
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ లాస్ట్ ఫిల్మ్ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. ఈ చిత్రం తర్వాత కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ఈ హీరో. చాలా కథలు విన్నారంట. చివరకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో సినిమా చేయనున్నట్టు ప్రకటించారు. సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.