Lakhimpur Kheri Violence : మూడు రోజుల పోలీస్ కస్టడీకి కేంద్రమంత్రి కొడుకు
ఉత్తర్ప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరి జిల్లాలో ఈనెల 3న జరిగిన ఘటనలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు 3 రోజుల
- venkaiahnaidu
- Published On : October 11, 2021 / 06:59 PM IST
Asish
Lakhimpur Kheri Violence ఉత్తర్ప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరి జిల్లాలో ఈనెల 3న జరిగిన ఘటనలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు 3 రోజుల పోలీస్ రిమాండ్ విధిస్తూ లఖింపూర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రైతులను కారుతో తొక్కించిన కేసులో ఆశిష్పై సెక్షన్ 302, 304ఏ, 147, 148, 149, 279, 120బీల కింద కేసు నమోదు చేశారు. ఈనెల 9న ఆశిష్ మిశ్రాను ఈ కేసు విషయమై పోలీసులు 12 గంటల పాటు విచారించారు. అనంతరం ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేశారు.
అయితే మిశ్రా దర్యాప్తునకు సహకరించట్లేదని.. ఈ కారణంగా ఆయనను పోలీస్ రిమాండ్కు అనుమతించాలని కోరుతూ కోర్టుకు దరఖాస్తు చేశారు. ఈ కేసుకు సంబంధించి సోమవారం విచారణ చేపట్టిన చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ జస్టిస్ చింతారామ్.. షరతుల మీద 3 రోజుల పోలీస్ రిమాండ్కు అనుమతించారు. లాయర్ సమక్షంలోనే మిశ్రాను ప్రశ్నించాలని, నిందితుడిని ఎలాంటి వేధింపులకు గురిచేయవద్దని పోలీసులకు కోర్టు సృష్టం చేసింది. ఇక,ఆశిష్ ఏ తప్పూ చేయలేదని, ఘటనకు సంబంధించిన 100కు పైగా ఫొటోలను, వీడియోలను పోలీసులకు ఇప్పటికే అందించామని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు.
అక్టోబరు 3న లఖింపూర్ ఖేరీలో జిల్లాలోని టికూనియా గ్రామ సరిహద్దు వద్ద నూతన సాగు చట్టాలపై నిరసన వ్యక్తం చేస్తోన్న రైతులపైకి ఓ వాహనం దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలో మరో ఇద్దరు బీజేపీ కార్యకర్తలు, ఓ డ్రైవర్ సహా ఓ జర్నలిస్ట్ ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఆశిష్ మిశ్రా తన కారుతో రైతులను తొక్కించారని.. ఈ క్రమంలో ఇద్దరు రైతులు ప్రాణాలు కోల్పోయారని రైతులు ఆరోపిస్తున్నారుఅయితే ఈ ఆరోపణలను అజయ్ మిశ్రా ఖండించారు.
ALSO READ రాజకీయ పార్టీల ఎలక్టోరల్ బాండ్ల విరాళాలు.. తెలుగు రాష్ట్రాల నుంచే టాప్-3 పార్టీలు
