Ayushman Bharat Card
Ayushman Bharat Card : దేశంలో కరోనా కేసుల ఉధృతి పెరిగిపోతోంది. కరోనా బారినపడి ఆస్పత్రుల్లో చేరితే వైద్యపరంగా ఖర్చులను భరించాల్సి వస్తుంది. ఆర్థికంగా బలహీన వర్గాలు పెద్ద మొత్తంలో వైద్యం చేయించుకోలేని పరిస్థితి.
Read Also : Covid-19 Cases : భారత్లో కరోనా కల్లోలం.. 2,710కి పెరిగిన కేసులు.. 7 మరణాలు.. కేరళలోనే అత్యధికం..!
ఇలాంటి వారి కోసం ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (PM-JAY)కింద ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ కార్డును ప్రవేశపెట్టింది. తద్వారా ఉచిత ఆరోగ్య సేవలను పొందవచ్చు. ఈ పథకం కింద రూ. 5 లక్షల వరకు ఆరోగ్య కవరేజీని అందిస్తుంది.
ఇటీవల ఢిల్లీతో సహా అనేక రాష్ట్రాల్లో ఆయుష్మాన్ భారత్ విస్తరించింది ప్రభుత్వం. కొన్ని రాష్ట్రాల్లో ఈ మొత్తం రూ. 10 లక్షలకు కూడా చేరుకుంది. ప్రతి పేదవాడికి మెరుగైన ఆరోగ్య సేవలను అందించడమే భారత ప్రభుత్వం లక్ష్యం.
ప్రస్తుతం కరోనా తీవ్రమవుతున్న పరిస్థితుల్లో అర్హత కలిగిన ప్రతిఒక్కరూ తప్పనిసరిగా ఆయుష్మాన్ భారత్ కార్డు కోసం అప్లయ్ చేసుకోవాలి. కరోనా బారినపడ్డ బాధితులకు రూ. 5 లక్షల వరకు ట్రీట్మెంట్ ఉచితంగా పొందవచ్చు.
ఆయుష్మాన్ కార్డుతో కరోనాకు ట్రీట్మెంట్? :
కరోనావైరస్ తీవ్రమైన కేసులకు, ఆయుష్మాన్ భారత్ యోజన కింద ట్రీట్మెంట్ పొందవచ్చు. మొదటి వేవ్ సమయంలో కూడా పెద్ద సంఖ్యలో ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు.
సాధారణ పరీక్షల కోసం లేదా OPDలో మాత్రమే చికిత్స పొందితే ఈ పథకం ప్రయోజనం లభించదు. ఆసుపత్రిలో చేరిన రోగులు మాత్రమే ఈ పథకం కింద ప్రయోజనం పొందవచ్చు.
ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ లేదా ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ (ESI) ఉన్నవారు కూడా ఈ పథకం ప్రయోజనాన్ని పొందవచ్చు. చికిత్స కోసం ఆస్పత్రిని PM-JAY నెట్వర్క్లో చేర్చాలి. ఆస్పత్రిలో చేరిన కేసులలో మాత్రమే ప్రయోజనం పొందవచ్చు.
ఆయుష్మాన్ భారత్ కార్డును ఎవరు పొందవచ్చు? :
అర్హులో కాదో ఎలా చెక్ చేయాలి? :
కార్డు కోసం ఎలా అప్లయ్ చేయాలి? :
Read Also : COVID-19 Cases : ఏలూరులో కరోనా ఉధృతి.. కలెక్టరేట్లో నలుగురు ఉద్యోగులకు పాజిటివ్..
అవసరమైన డాక్యుమెంట్లు :