Good News : మహిళలకు గుడ్ న్యూస్.. ప్రతి నెలా రూ. 2,500 ఆర్థిక సాయం.. ఎవరు అర్హులు? ఎక్కడ అప్లయ్ చేయాలి? ఫుల్ డిటెయిల్స్..!

Good News : బీజేపీ ఎన్నికల హామీ ప్రకారం.. మహిళలకు ప్రతి నెలా రూ.2,500 ఆర్థిక సహాయం అందజేయనుంది. మార్చి 8 నాటికి మొదటి విడత మహిళల ఖాతాల్లో జమ కానుంది. పూర్తి వివరాలను ఓసారి చూద్దాం..

Delhi women to get first instalment

Good News : ఢిల్లీ కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి రేఖ గుప్తా మహిళల కోసం భారీ ప్రకటన చేశారు. భారతీయ జనతా పార్టీ (BJP) ఎన్నికల హామీ ప్రకారం.. మహిళలకు ప్రతి నెలా రూ.2,500 ఆర్థిక సాయం అందజేయనున్నట్లు ఆమె తెలిపారు. మార్చి 8 నాటికి మొదటి విడత మహిళల ఖాతాలకు జారీ కానుందని ఆమె చెప్పారు. మహిళలు ఎవరు అర్హులు? ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Read Also : PM Kisan 19th Installment : ఈ నెల 24నే రైతుల ఖాతాల్లోకి రూ. 2వేలు.. పీఎం కిసాన్ జాబితాలో మీ పేరును ఇలా చెక్ చేయండి!

నెలకు రూ. 2500 ఆర్థిక సాయం :
ఢిల్లీ ఎన్నికలకు ముందు, బీజేపీ తన మ్యానిఫెస్టోలో మహిళలకు నెలకు రూ.2,500 హామీ ఇచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) హామీల ప్రకారం.. రూ.2,100 వాగ్దానం కన్నా ఎక్కువ ఇస్తోంది. బీజేపీ చారిత్రాత్మక విజయం తర్వాత ఢిల్లీ కొత్త సీఎం రేఖ గుప్తా ఈ వాగ్దానానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు.

మార్చి 8న వాయిదా విడుదల :
మార్చి 8 నాటికి 100 శాతం ఆర్థిక సహాయం మహిళల ఖాతాలకు బదిలీ కానుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8న జరుపుకోవడం గమనార్హం. ఢిల్లీ బీజేపీ ప్రభుత్వం ఈ రోజున మొదటి విడత విడుదల చేయనుంది. తద్వారా మహిళలకు ఆర్థిక సాయం అందనుంది.

ఎవరికి ఆర్థిక సాయం :
ఈ పథకం నిరుపేద మహిళలకు మాత్రమే. ఢిల్లీలోని పేద కుటుంబాలకు చెందిన మహిళలు మాత్రమే ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతారని బీజేపీ తన మ్యానిఫెస్టోలో స్పష్టం చేసింది. ఆర్థికంగా బలహీనంగా ఉన్న మహిళలకు సాయం చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం.

అవసరమైన పత్రాలివే :
ఈ పథకం ప్రయోజనాలను పొందడానికి, ఆధార్ కార్డు, ఢిల్లీ నివాస ధృవీకరణ పత్రం, ఆధార్‌తో లింక్ అయిన బ్యాంకు అకౌంట్, ఆదాయ ధృవీకరణ పత్రం అవసరం. వార్షిక ఆదాయం రూ. 3 లక్షల కన్నా తక్కువ ఉన్న కుటుంబాలు మాత్రమే ఈ పథకానికి అర్హులు అవుతారు. వార్షిక ఆదాయం రూ. 3 లక్షల కన్నా ఎక్కువ ఉన్న కుటుంబాల మహిళలు ఈ పథకం ప్రయోజనం పొందలేరని గమనించాలి.

Read Also : SIP Investment Plan : రిస్క్ తక్కువ.. రాబడి ఎక్కువ.. SIPలో ఎలా పెట్టుబడి పెట్టాలి.. ప్రయోజనాలేంటి? గుర్తుంచుకోవాల్సిన విషయాలివే!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 48 స్థానాల్లో బీజేపీ గెలిచి ఆమ్ ఆద్మీ పార్టీ పదేళ్ల పాలనకు ముగింపు పలికింది. ఈ విజయంతో రేఖా గుప్తా ఢిల్లీకి నాల్గవ మహిళా ముఖ్యమంత్రిగా ఎన్నిక అయ్యారు. ఢిల్లీ ప్రజలు కొత్త బీజేపీ ప్రభుత్వం నుంచి అనేక కొత్త పథకాలను ఆశిస్తున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేఖ గుప్తా ఈ అంచనాలను ఎంతవరకు నెరవేరుస్తారో చూడాలి.