Udhayanidhi Stalin
Udhayanidhi Stalin : సనాతన ధర్మ’ వ్యాఖ్యలపై డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్పై పోలీసు కేసు నమోదైంది. ముంబయి నగరంలోని మీరా రోడ్ పోలీసులు ఐపీసీ 153 ఏ, 295 ఏ సెక్షన్ల కింద ఉదయనిధిపై కేసు నమోదు చేశారు. (FIR registered against Udhayanidhi Stalin) సనాతన ధర్మానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలకు గాను ఉదయనిధి స్టాలిన్పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ తమిళనాడులోని బీజేపీ ప్రతినిధి బృందం రాష్ట్ర పోలీసులకు మెమోరాండం అందజేసింది. (Sanatana Dharma row) చెన్నైలో జరిగిన ఒక సమావేశంలో ఉదయనిధి మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Road Accident : జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై బస్సు, ట్రక్కు ఢీ… 11 మంది మృతి
సనాతన ధర్మానికి వ్యతిరేకంగా డెంగ్యూ, మలేరియా, జ్వరం, కరోనాలతో సమానం అని అన్నారు. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడమే కాకుండా నిర్మూలించాలని ఆయన కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ ఉదయనిధి వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సనాతన ధర్మంపై ఉదయనిధి ఏం మాట్లాడారో తెలియకుండా ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేయడం అన్యాయమని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు.
COVID boosters : అమెరికన్లకు కొత్త కొవిడ్ బూస్టర్…యూఎస్ ఆరోగ్యసంస్థ సిఫార్సు
సనాతన ధర్మం సృష్టించిన తుపాన్ దేశంలో రాజకీయ దుమారాన్ని సృష్టించింది. ప్రతిపక్ష భారత కూటమిలో భాగమైన కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఆమ్ ఆద్మీ పార్టీలు డిఎంకే నాయకుడికి దూరంగా ఉన్నాయి.