Road Accident : జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై బస్సు, ట్రక్కు ఢీ… 11 మంది మృతి

జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న ట్రక్కు ఆగి ఉన్న బస్సును ఢీకొన్న ప్రమాదంలో 11 మంది మరణించారు....

Road Accident : జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై బస్సు, ట్రక్కు ఢీ… 11 మంది మృతి

Road Accident

Road Accident : జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న ట్రక్కు ఆగి ఉన్న బస్సును ఢీకొన్న ప్రమాదంలో 11 మంది మరణించారు. (Jaipur-Agra National Highway) గుజరాత్ నుంచి మధుర వెళ్తున్న ప్యాసింజర్ బస్సు చెడిపోవడంతో హైవే పక్కనే నిలిపారు. వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొట్టడంతో ప్రాణనష్టం జరిగింది. (truck rams bus)

COVID boosters : అమెరికన్లకు కొత్త కొవిడ్ బూస్టర్…యూఎస్ ఆరోగ్యసంస్థ సిఫార్సు

ఈ ప్రమాదంలో 12 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మంగళవారం రాజస్థాన్‌లోని హనుమాన్‌ఘర్ జిల్లాలో జీపు బస్సును ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు మరణించారు. హనుమాన్‌గఢ్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని లఖోవాలీ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మృతులను నంద్రం జాట్ (70), నీతూ జాట్ (60), దీపు జాట్ (13), అర్జున్ జాట్ (40)గా గుర్తించారు. జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.