అత్యాచారం అంటే ఆటలా? : తూచ్..నాపై రేప్ జరగలేదన్న వెంటిలేటర్ పేషెంట్

Gurugram Tb patient rape Allegations : టీబీతో బాధపడుతున్న 21 సంవత్సరాల యువతి ఢిల్లీ పరిధిలోని గురుగ్రామ్ లో ఉన్న ఫోర్టిస్ హాస్పిటల్ ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో ఆమె తనపై అత్యాచారం జరిగిందని గతవారం సంచలన ఆరోపణలు చేసిన ఆ యువతి మాట మార్చింది. తనపై అత్యాచారం జరగలేదని పోలీసుల విచారణలో వెల్లడించింది.
దీంతో ఆమె కుటుంబ సభ్యులతో పాటు పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. ట్యూబర్ క్యూలోసిస్ వ్యాధితో బాధ పడుతున్న ఆమె చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరితే, ఆమెపై అత్యాచారం జరిగిందన్న వార్త గత వారం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.
https://10tv.in/coronavirus-patients-lungs-found-hard-as-a-leather-ball-in-autopsy/
మాట్లాడలేనిస్థితిలో ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స ఆ యువతి తనపై ఓ యువకుడు పలు మార్లు అత్యాచారం తన తండ్రికి లేఖ చూపించింది.దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా..హాస్పిటల్ లో ఉన్న సీసీ టీవీలను పరిశీలించగా అటువంటిదేమీ జరగలేదని నిర్ధారణకు వచ్చారు.కానీ ఆమెఎందుకు అలా తండ్రికి లెటర్ రాసిందో తెలియలేదు..ప్రస్తుతం మాట్లాడలేని స్థితిలో ఉన్న ఆమె పూర్తి స్పృహలోకి వచ్చాక ఆమెను వాంగ్ములం తీసుకుని విచారణ కొనసాగిస్తామని వెల్లడించారు.
ఈ క్రమంలో ఆమె దాదాపు ఆరు రోజుల తరువాత పూర్తి స్పృహలోకి వచ్చిన తరువాత ఆమె పోలీసులకు వాగ్మూలం ఇస్తూ, తనపై ఎవరూ అత్యాచారం చేయలేదని స్పష్టంగా చెప్పిందని పోలీసులు తెలిపారు. రేప్ జరగలేదని స్పష్టం చేసినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు.
ఆసుపత్రి సీసీ కెమెరాలు సైతం ఇదే విషయాన్ని సష్టం చేశాయని తెలిపారు. కాగా..ఈ యువతి అక్టోబర్ 21న ఆసుపత్రిలో చేరగా, అప్పటికే శ్వాస తీసుకోలేకపోతున్న ఆమెకు వెంటిలేటర్ ను అమర్చి వైద్యులు చికిత్స చేశారు.
ఆపై 21 నుంచి 27 మధ్య వికాస్ అనే వ్యక్తి తన కుమార్తెపై అత్యాచారం చేశాడని, ఆ విషయాన్ని తన బిడ్డ స్వయంగా చెప్పిందని ఆమె తండ్రి పోలీసులను ఆశ్రయించడంతో కేసు వెలుగులోకి వచ్చింది. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, పోలీసులు రంగంలోకి దిగారు. వికాస్ అనే వ్యక్తి ఆసుపత్రిలో పనిచేయడం లేదని, సీసీటీవీ కెమెరాలు పరీక్షిస్తే, అత్యాచారం ఆనవాళ్లు కనిపించలేదని అధికారులు వెల్లడించారు. బాధితురాలు సైతం విచారణలో ఇదే విషయాన్ని వెల్లడించిందని తెలిపారు.