గన్‌ తో బెదిరించి బిల్డర్‌ ఇంట్లో చోరీ : వీడియో

  • Publish Date - November 27, 2019 / 05:48 AM IST

మధ్యప్రదేశ్‌ లో మంగళవారం (నవంబర్ 26, 2019) రాత్రి చోరీ జరిగింది. ఓ బిల్టర్‌ ఇంటికి ఐదుగురు దొంగలు వెళ్లి ఇంటి బయట కూర్చున్న సెక్యూరిటీ గార్డుతో పాటు మరో వ్యక్తిని తుపాకులు, మారణాయుధాలతో బెదిరించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌ లోని ఇండోర్‌ లో లాసుడియా ఏరియాలో చోటుచేసుకుంది. 

ఈ ఐదుగురు దొంగలు ఎంతో తెలివిగా అక్కడున్న సెక్యూరిటీ గార్డుని, ఇంక్కో వ్యక్తిని ఇద్దరిని ఇంట్లోకి తీసుకెళ్లి.. నగదుతో పాటు విలువైన వస్తువులను దొంగిలించారు. విషయం తెలుసుకున్న బిల్డర్ ఈ ఘటనపై  పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం పోలీసు అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేపట్టారు.

ఆ దంగలు ఇంటి బయట ఉన్న సెక్యూరిటీ గార్డును బెదిరించిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దీంతో ఇంటి ఓనర్ వెంటనే సీసీటీవీ ఫుటేజీ తీసుకెళ్లి పోలీసులకు చూపించారు. ఈ వివరాల ఆధారంగా పోలీసులు దర్యార్తు చేస్తున్నారు.