Manda Krishna Madiga : కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిసిన మంద కృష్ణ మాదిగ.. పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని విజ్ఞప్తి
సుదీర్ఘకాలం పాటు సాగుతున్న పోరాటానికి న్యాయమైన ముగింపు ఇవ్వాలని కోరారు. పార్లమెంటులో త్వరగా బిల్లు పెట్టాలన్న మంద కృష్ణ మాదిగ విజ్ఞప్తికి అమిత్ షా సానుకూలంగా స్పందించారు.
- bheemraj
- Published On : October 2, 2023 / 04:25 PM IST
Manda Krishna Madiga meet Amit Shah
Manda Krishna Madiga – Amit Shah : ఎమ్ఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిశారు. కేంత్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు అమిత్ షా ను కలిశారు. ఎస్సీ వర్గీకరణపై సత్వరం నిర్ణయం తీసుకోవాలని అమిత్ షాకు మంద కృష్ణ మాదిగ విజ్ణప్తి చేశారు.
సుదీర్ఘకాలం పాటు సాగుతున్న పోరాటానికి న్యాయమైన ముగింపు ఇవ్వాలని కోరారు. పార్లమెంటులో త్వరగా బిల్లు పెట్టాలన్న మంద కృష్ణ మాదిగ విజ్ఞప్తికి అమిత్ షా సానుకూలంగా స్పందించారు.
Bihar Caste Survey: కులగణన ఫలితాలు వెల్లడించిన బిహార్ ప్రభుత్వం.. స్వాతంత్ర్య దేశంలో ఇదే మొదటి సర్వే
భాగస్వామ్య పక్షాలందరితో చర్చించి త్వరలో మంచి నిర్ణయం తీసుకుంటామని అమిత్ షా హామీ ఇచ్చారు. అక్టోబర్ 7వ తేదీ నుంచి అలంపూర్ నుంచి తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నానని మంద కృష్ణ మాదిగ చెప్పారు.
