Minister Washes Feet of Person : ‘రోడ్ల పరిస్థితి బాగాలేదు క్షమించండీ’ అంటూ వ్యక్తి కాళ్లు కడిగిన మంత్రి

మధ్యప్రదేశ్‌ రాజకీయాల్లో తననంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విద్యుత్‌ శాఖ మంత్రి ప్రద్యుమ్న్‌ సింగ్‌ తోమర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ‘రోడ్ల పరిస్థితి బాగాలేదు క్షమించండీ’ అంటూ వ్యక్తి కాళ్లు కడిగారు మంత్రి ప్రద్యుమ్న.

MP Minister  washes feet of person : మధ్యప్రదేశ్‌ రాజకీయాల్లో తననంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విద్యుత్‌ శాఖ మంత్రి ప్రద్యుమ్న్‌ సింగ్‌ తోమర్ మరోసారి వార్తల్లో నిలిచారు. తన నియోజక వర్గం అయిన గ్వాలియర్ లో రోడ్లు బాగా దెబ్బతిన్నాయిని వాటికి మరమత్తులు చేయించమని ఆ పనులు చేపట్టే వరకు చెప్పులు ధరించను అని ప్రతిజ్ఞ చేసి 56 రోజులుగా మంత్రి ప్రద్యుమన్ సింగ్ చెప్పులు ధరించకుండా ఉన్న మంత్రి రోడ్లు మరమత్తుల పనులు ప్రారంభమయ్యాక స్వయంగా కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా స్వయంగా రాష్ట్ర మంత్రి ప్రద్యుమ్నకు స్వయంగా చెప్పులు అందించాకనే చెప్పులు ధరించారు. దీనికి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Jyotiraditya Scindia- Minister Wear ‘chappal’ : 2నెలల తరువాత చెప్పులు ధరించిన రాష్ట్ర మంత్రి..స్వయంగా చెప్పులు అందించిన కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా

అలాగే పాఠశాలలో టాయిలెట్లు సరిగ్గా లేవు సార్..దీనివల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటున్నామని ఓ విద్యార్థిని ఫిర్యాదు చేయటంతో మంత్రికి స్వయంగా రంగంలోకి దిగారు. ఆ పాఠశాలకు వెళ్లి టాయిలెట్లను కడిగి శుభ్రం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అదే మంత్రి ప్రద్యుమ్న మరోసారి తనదైన శైలిలో స్పందిస్తు వార్తల్లో నిలిచారు. ఈసారి మంత్రి ఓ వ్యక్తి కాళ్లు కడిగి వార్తల్లోకెక్కారు. తన సొంత నియోజకవర్గం అయిన గ్వాలియర్‌లో సోమవారం (జనవరి 16,2023) పర్యటిస్తున్న మంత్రి ప్రత్యుమ్న సింగ్ తోమర్ రోడ్ల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.

Madhya Pradesh : విద్యార్థిని ఫిర్యాదు.. టాయిలెట్లు కడిగిన మంత్రి

రోడ్లు సరిగ్గా లేనందుకు ప్రజలకు క్షమాపణ చెప్పారు. అక్కడితో మంత్రి ఊరుకోలేదు. అక్కడే ఉన్న ఓ పౌరుడి కాళ్లను కడిగి క్షమాపణలు చెప్పారు. త్వరలోనే కొత్త రహదారులను వేయిస్తానని హామీ ఇచ్చారు.మంత్రి ఓ వ్యక్తి కాళ్లు కడిగిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇలా మంత్రి ప్రద్యుమ్న తన నియోజక వర్గంలో అభివృద్దికోసం నిరంతరం పాటు పడుతుంటారు. అలా మధ్యప్రదేశ్‌ రాజకీయాల్లో తననంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు విద్యుత్‌ శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్న ప్రద్యుమ్న్‌ సింగ్‌ తోమర్.

 

ట్రెండింగ్ వార్తలు