దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్న సమయంలో జూన్-30వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ఇవాళ(మే-30,2020) ప్రకటించిన కేంద్రం.. లాక్ డౌన్ 5.0కి సంబంధించి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కేంద్ర హోంశాఖ విడుదల చేసిన గైడ్ లైన్స్ లో లాక్ డౌన్ 5.0కి బదులుగా అన్ లాక్ 1అనే పదం ఉపయోగించబడింది. జూన్ 30వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని తెలిపిన కేంద్రం రాత్రి పూట కర్ఫ్యూ కొనసాగుతుందని సృష్టం చేసింది. అయితే లాక్ డౌన్ 4.0లో కర్ఫ్యూ సమయం రాత్రి 7గంటల నుంచి ఉదయం 7గంటల వరకు ఉండగా,ఇప్పుడు లాక్ డౌన్ 5.0లో(జూన్-30వరకు)రాత్రి కర్ఫ్యూ సమయం తగ్గించబడింది.
జూన్ 30వరకు దేశవ్యాప్తంగా రాత్రి 9గంటల నుంచి ఉదయం 5గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. ఎసెన్షియల్ సర్వీసులకు మాత్రం రాత్రి పూట తిరిగేందుకు మినహాయింపు ఉంది. అయితే దేశవ్యాప్తంగా సాయంత్రం 9గంటల నుంచి ఉదయం 5గంటల వరకు మాత్రం వ్యక్తులు బయట తిరగటంపై యథావిధిగా నిషేధం కొనసాగుతుందని హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది.
కంటైన్మెంట్ జోన్లలో మినహా మిగిలిన అన్ని చోట్లా జూన్ 8నుంచి రెస్టారెంట్లు,ఆతిథ్య రంగ సేవలు, మాల్స్,ఆలయాలు తిరిగి తెరుచుకోవచ్చునని కేంద్రం తెలిపింది. పరిస్థితుల ఆధారంగా మైట్రో రైళ్లు,అంతర్జాతీయ విమానలు,స్విమ్మింగ్ పూల్స్,పార్క్ లు,సినిమా హాల్స్,జిమ్ లు ఓపెనింగ్ పై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. స్కూళ్లు,కాలేజీలు,కోచింగ్ ఇనిస్టిట్యూట్ లు,విద్యాసంస్థలు మొదలైనవి అన్నీ రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలతో సంప్రదింపుల తర్వాత తెరుచుకోబడతాయని తెలిపింది.
సీనియర్ సిటిజన్లు,దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న పెద్దలు,10ఏళ్ల లోపు పిల్లలు ఇళ్లకే పరిమితమవ్వాలని సూచించింది. ఫేస్ మాస్క్ లు ధరించడం,సోషల్ డిస్టెన్స్ నిబంధనలు పాటించడం తప్పనిసరి అని తెలిపింది. ఎసెన్షియల్ సర్వీసెస్ మినహా కంటైన్మెంట్ జోన్లలో జూన్ 30వరకు ఎటువంటి మినహాయింపులు లేని లాక్ డౌన్ కొనసాగనుంది. ఇక, దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 1లక్షా 75వేలకు చేరువలో ఉండగా,మరణాల సంఖ్య 5వేలకు చేరింది. దేశంలో అత్యధిక కేసులు,మరణాలు మహారాష్ట్రలో నమోదయ్యాయి.