Pune
Pune : రైల్వే స్టేషన్లలో కొంతమంది ప్రయాణికులు ప్లాట్ఫామ్లపై నిద్రిస్తుండటం మనం గమనిస్తూ ఉంటాము. అలా నిద్రిస్తున్న కొందరిపై పోలీసు అధికారి నీళ్లు పోశాడు. రూపేష్ చౌదరి అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోని షేర్ చేయడంతో వైరల్గా మారింది. ‘రిప్ హ్యుమానిటీ’ అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
Rupen Chowdhury అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో ప్రభుత్వ రైల్వే పోలీస్ (GRP) ప్లాట్ఫామ్పై నిద్రిస్తున్న వ్యక్తులపై బాటిల్తో నీటిని పోస్తున్నారు. నిద్రిస్తున్న వారిలో ఒక పెద్దాయన కూడా ఉన్నాడు. ఈ సంఘటన పూణే రైల్వే స్టేషన్లో జరిగింది. ఈ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ వీడియో షేర్ చేసిన వ్యక్తి ‘రిప్ హ్యుమానిటీ’ అనే శీర్షికతో పోస్ట్ చేశారు. ఇక ఈ ఘటన రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. పూణే డివిజనల్ రైల్వే మేనేజర్ (DRM) ఇందు దూబే ఈ ఘటనపై స్పందించారు. ఇలా జరగడం ‘తీవ్ర విచారం’ అని పేర్కొన్నారు. ‘ప్లాట్ ఫామ్ పై పడుకోవడం ఇతరులకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అందువల్ల ఈ పద్ధతిలో కౌన్సిలింగ్ చేయడం సరైన మార్గం కాదు.. ప్రయాణికుల పట్ల గౌరవంగా, మర్యాదగా వ్యవహరించాలని సంబంధిత సిబ్బందికి సూచనలు చేయడం జరిగింది.’ అని శ్రీమతి దూబే తెలిపారు.
Kerala : రూ. కోటి లాటరీ గెలిచిన వ్యక్తికి పోలీస్ సెక్యురిటీ
ఇక సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ వీడియో చూసి ‘సిగ్గు చేటు’ అని.. ‘ఇలా ప్రవర్తించడం అమానుషం’ అని అభిప్రాయపడ్డారు. రైలు కోసం వేచి ఉన్న ప్రజల కోసం రైల్వే అధికారులు విశ్రాంతి స్థలాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
RIP Humanity ??
Pune Railway Station pic.twitter.com/M9VwSNH0zn
— ?? Rupen Chowdhury ? (@rupen_chowdhury) June 30, 2023