చరిత్రాత్మక కోసి రైల్ మహాసేతు(మెగా బ్రిడ్జ్)ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు. బీహార్లోని కోసి రైల్ మహాసేతును వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా అంకితం చేసిన మోడీ.. బీహార్ రాష్ట్రానికి ప్రయోజనం కలిగించే విధంగా ప్రయాణికుల సౌకర్యాలకు సంబంధించి 12 రైలు ప్రాజెక్టులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా బీహార్లో రైలు కనెక్టివిటీ రంగంలో కొత్త చరిత్ర సృష్టించబడిందని ప్రధాని మోడీ అన్నారు. వీటిలో కియుల్ నదిపై కొత్త రైల్వే బ్రిడ్జి, రెండు కొత్త రైల్వే లైన్లు, ఐదువిద్యుదీకరణ ప్రాజెక్టులు, ఒక ఎలక్ట్రిక్ లోకోమోటివ్ షెడ్, బర్హ్-భక్తియార్పూర్ మధ్య మూడో లైను ప్రాజెక్టు ఉన్నాయి. రైల్వేల విద్యుదీకరణకు, రైల్వేలలో మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహించడానికి కొత్త ఉద్యోగాలు కల్పించేందుకు ఈ డజను ప్రాజెక్టులు బీహార్లో ప్రారంభించబడ్డాయి.
మహాసేతు ప్రారంభంతో, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఈశాన్య ప్రాంతాలతో పరిచయం చాలా సులభం అవుతుంది. 1887లో నిర్మాలి మరియు భతతిహి (సారైగాడ్) మధ్య మీటర్ గేజ్ నిర్మించబడింది. ఈ రైలు మార్గం 1934లో భారీ వరదలు మరియు వినాశకరమైన భూకంపంతో కొట్టుకుపోయింది. కోసి మెగా వంతెన ప్రాజెక్టుకు భారత ప్రభుత్వం 2003-04 సంవత్సరంలో ఆమోదం తెలిపింది.
అక్టోబర్-నవంబర్లో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. ఎన్నికల సంఘం ఎప్పుడైనా రాష్ట్రంలో ఎన్నికలు ప్రకటించవచ్చు. ఈ రైలు వంతెన మరియు రహదారి నేపాల్ సరిహద్దుకు సమాంతరంగా ఉంది, కాబట్టి దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత కూడా ఉంది. ఈ ప్రాజెక్ట్ ప్రారంభంతో బీహార్ వాసుల 86ఏళ్ల నిరీక్షణ ముగిసింది.