పశ్చిమ బెంగాల్లో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య పోస్టర్ వార్ నడుస్తోంది.
కోల్ కతా : పశ్చిమ బెంగాల్లో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య పోస్టర్ వార్ నడుస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ దుర్గాపూర్ సభలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా బీజేపీ దుర్గాపూర్లో మోడీ పోస్టర్లను వేశారు. అయితే మోడీ పోస్టర్లపై గుర్తు తెలియని వ్యక్తులు పేడ, బురద చల్లారు. అంతేకాదు…మోడీ పోస్టర్పై టిఎంసి కార్యకర్తలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోస్టర్ను అతికించారు. దీనిపై బీజేపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.