భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్.అంబేద్కర్ ఇంటిపై దుండగులు దాడికి తెగబడ్డారు. ముంబైలోని దాదర్ హిందూ కాలనీలో ఉన్న రాజ్గృహాలోకి మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో కొంతమంది దుండగులు చొరబడి వరండాలో ఉన్న పూల కుండీలను చిందరవందరగా పడేశారు. కొన్నింటిని ధ్వంసం చేశారు.
అంబేద్కర్ ముంబైలో స్థిరపడిన తరువాత 1930లో ఈ మూడు అంతస్తుల భవనాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఇది హెరిటేజ్ మ్యూజియంతో పాటు స్మారక చిహ్నంగా అలరారుతోంది. ఈ భవనంలో మొదటి అంతస్తు వరకు అంబేద్కర్ వ్యక్తిగత వస్తువులను ప్రదర్శనకు ఉంచారు. మిగితా రెండు అంతస్తులు ఆయన వారసులు వినియోగించుకుంటున్నారు.
Read Here>>డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకున్నా కోవిడ్ పరీక్షలకు అనుమతి