×
Ad

Operation Ajay : ఇజ్రాయెల్ నుంచి 235 మంది భారతీయులతో ఢిల్లీ వచ్చిన రెండో విమానం

ఆపరేషన్ అజయ్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో శనివారం తెల్లవారుజామున యుద్ధంలో దెబ్బతిన్న ఇజ్రాయెల్ దేశం నుంచి రెండవ బ్యాచ్ భారతీయ పౌరులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు....

  • Published On : October 14, 2023 / 08:38 AM IST

Operation Ajay

Operation Ajay : ఆపరేషన్ అజయ్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో శనివారం తెల్లవారుజామున యుద్ధంలో దెబ్బతిన్న ఇజ్రాయెల్ దేశం నుంచి రెండవ బ్యాచ్ భారతీయ పౌరులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. ఇద్దరు శిశువులతో సహా 235 మంది భారతీయ పౌరులతో విమానం శనివారం న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది.

Also Read :Gaza tunnels : గాజాలోని హమాస్ రహస్య సొరంగాలపై దాడి…ఇజ్రాయెల్‌ సైన్యానికి సవాలు

అక్టోబర్ 7వతేదీన గాజా నుంచి హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ పట్టణాలపై దాడుల నేపథ్యంలో స్వదేశానికి తిరిగి రావాలనుకునే వారిని సులభతరం చేయడానికి భారతదేశం గురువారం ఆపరేషన్ అజయ్ ప్రారంభించింది. ఇజ్రాయెల్ నుండి 212 మంది భారతీయ పౌరులతో ఆపరేషన్ అజయ్ కింద మొదటి చార్టర్ ఫ్లైట్ శుక్రవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో దిగింది.

Also Read : Ukraine war : యుక్రెయిన్ యుద్ధం కోసం రష్యాకు ఉత్తర కొరియా 1000 కంటైనర్లలో ఆయుధాలు…రహస్యంగా రైళ్లలో తరలింపు, ఉపగ్రహ ఛాయా చిత్రాల్లో వెల్లడి

భారతీయులందరూ మిషన్ యొక్క డేటాబేస్లో పేర్ల నమోదు చేసుకోవడానికి భారత రాయబార కార్యాలయం ప్రారంభించిన డ్రైవ్ తర్వాత ప్రయాణీకులను ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఆధారంగా ఎంపిక చేశారు. వారి విమాన చార్జీలను ప్రభుత్వమే భరిస్తోంది. హమాస్ దాడిలో ఇజ్రాయెల్‌లో 1,300 మందికి పైగా మరణించారు. ఇజ్రాయెల్ ఎదురు వైమానిక దాడుల్లో గాజాలో 1,900 మందికి పైగా మరణించారు.

Also Read :Mosque Blast : అఫ్ఘానిస్థాన్‌లో శుక్రవారం ప్రార్థనల సమయంలో మసీదులో పేలుళ్లు…15 మంది మృతి