Cm Revanth Reddy: సీఎం రేవంత్ US టూర్ రద్దు.. కేంద్రం వైఖరిపై తీవ్ర ఆగ్రహం.. త్వరలో అసలు నిజాలు బయటపెడతా
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Cm Revanth Reddy) విదేశీ పర్యటనకు విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది.
- V Santhosh Kumar
- Published on- August 23, 2026 / 04:40 PM IST
Telangana cm revanth reddy us tour cancelled
- సీఎం రేవంత్ అమెరికా పర్యటన రద్దు
- కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం
- త్వరలో రేవంత్ మీడియా సమావేశం
Cm Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. కేంద్ర ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపు చర్యల వల్లే తన అమెరికా పర్యటన నిలిచిపోయిందని సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లండన్ పర్యటన ముగిసిన అనంతరం బోస్టన్ వెళ్లాల్సి ఉండగా, కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంతో ఆయన లండన్ నుంచే నేరుగా హైదరాబాద్కు తిరుగుపయనమయ్యారు. ఈ విషయమై సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన, కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష వైఖరిని గట్టిగా ఎండగట్టారు.
Bangladesh: బంగ్లాదేశ్లో దారుణం.. హిందూ కుటుంబంలో నలుగురి ఘోర హత్య.. మూసి ఉన్న ఇంట్లో భయంకర దృశ్యం
ఖర్గే, కాంగ్రెస్ నాయకులకు రేవంత్ కృతజ్ఞతలు:
కేంద్ర వైఖరిని ప్రశ్నిస్తూ తనకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సీఎం రేవంత్ రెడ్డి (Cm Revanth Reddy)ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తన పర్యటన రద్దుపై దేశవ్యాప్తంగా స్పందించి మద్దతుగా నిలిచిన పార్టీ అగ్రనాయకులకు, ప్రజాసంఘాలకు, ప్రజలకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. గత మూడు రోజులుగా లండన్లో చేపట్టిన అన్ని అధికారిక కార్యక్రమాలు మరియు పెట్టుబడుల సమావేశాలు అత్యంత విజయవంతంగా పూర్తయ్యాయని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వివరించారు.
హైదరాబాద్కు రాక, త్వరలోనే మీడియా సమావేశం:
కేంద్రం నిర్ణయంతో బోస్టన్ షెడ్యూల్ రద్దు కావడంతో మరికొద్ది గంటల్లోనే తాను హైదరాబాద్ చేరుకోనున్నట్లు సీఎం వెల్లడించారు. తన విదేశీ పర్యటనలకు అనుమతి నిరాకరించడం వెనుక ఉన్న అసలు కారణాలను, దాని ప్రభావాలను రాజధానికి తిరిగొచ్చిన వెంటనే స్పష్టం చేస్తానని తెలిపారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వ వైఖరిని, తదుపరి కార్యాచరణను పూర్తి వివరాలతో మీడియా ముందుకు వచ్చి వెల్లడిస్తానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
