Indian antiquities: అమెరికా దొంగిలించిన భారతీయ పురాతన వస్తువులు తిరిగొస్తున్నాయ్.. వాటిలో ప్రధానమైనవి ఇవే..
అమెరికా నుంచి భారత్ కు రానున్న పురాతన వస్తువులు దాదాపు 400 ఏళ్ల మధ్య కాలానికి చెందినవి. భారత్ లోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన
- Harishth Thanniru
- Published On : September 23, 2024 / 11:21 AM IST
Joe Biden and Modi
297 Indian Antiquities : ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించారు. ఈ పర్యటన సమయంలో భారతదేశం నుంచి గతంలో అమెరికాకు అక్రమంగా రవాణా చేసిన 297 పురాతన వస్తువులను అమెరికా భారతదేశంకు తిరిగి ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ యూఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయాన్ని ‘ఎక్స్’ వేదికగా మోదీ తెలిపారు. 297 అమూల్యమైన పురాతన వస్తువులను భారతదేశానికి తిరిగి ఇచ్చేలా హామీ ఇచ్చినందుకు అధ్యక్షుడు జో బిడెన్, యూఎస్ ప్రభుత్వానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని మోదీ పేర్కొన్నారు.
Also Read : PM Modi : భారత్ చెబితే ప్రపంచం వింటుంది.. న్యూయార్క్లో ప్రధాని మోదీ ప్రసంగంలో ఐదు ప్రధాన అంశాలు ఇవే..
ఈ పురాతన వస్తువులు దాదాపు 400 ఏళ్ల మధ్య కాలానికి చెందినవి. భారత్ లోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన క్రీస్తు పూర్వం 2000 నుంచి క్రీస్తు శకం 1900 మధ్య కాలానికి చెందిన వస్తువులు ఇవి. ఈ పురాతన వస్తువుల్లో చాలా వరకు తూర్పు భారత్ కు చెందిన టెర్రాకోట కళాఖండాలు.. మిగతావి రాయి, లోహాలు, కలప, దంతాలతో సృష్టించిన దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కళాఖండాలు ఉన్నాయి.
- భారత్ కు అందిస్తున్న పురాతన వస్తువుల్లో ప్రధానమైనవి కొన్ని..
మధ్య భారతానికి చెందిన క్రీస్తుశకం 10-11వ శతాబ్దాల నాటి ఇసుకరాతి అప్సర.
మధ్య భారతానికి చెందిన క్రీస్తు శకం 15-16వ శాతాబ్దాల నాటి కాంస్య జైన తీర్థంకర విగ్రహం.
తూర్పు భారతానికి చెందిన క్రీస్తు శకం 3-4 శతాబ్దాల నాటి టెర్రాకోట పాత్ర.
దక్షిణ బారతదేశానికి చెందిన క్రీస్తుపూర్వం 1వ శతాబ్దం, క్రీస్తుశకం 1వ శతాబ్దం నాటి రాతి శిల్పం.
క్రీస్తు శకం 17-18 శతాబ్దాల నాటి దక్షిణ భారతదేశానికి చెందిన వినాయకుడి విగ్రహం.
క్రీస్తు శకం 15-16 శతాబ్దాల నాటి ఉత్తర భారతదేశానికి చెందిన ఇసుకరాయితో చేసిన నిలబడి ఉన్న బుద్ధుడి విగ్రహం.
క్రీస్తు శకం 17-18 శతాబ్దాల నాటి తూర్పు భారతదేశానికి చెందిన కాంస్యంతో చేసిన విష్ణు భగవానుడి విగ్రహం.
క్రీస్తు పూర్వం 2000-1800 కాలం నాటి ఉత్తర భారతానికి చెందిన రాగితో చేసిన సగుణవాది విగ్రహం.
క్రీస్తు శకం 17-18 శతాబ్దాల నాటి దక్షిణ భారతానికి చెందిన కాంస్యంతో చేసిన కృష్ణ భగవానుడి విగ్రహం.
క్రీస్తు శకం 13-14 శతాబ్దాల నాటి దక్షిణ భారతానికి చెందిన నల్లరాతి కార్తికేయ భగవానుడి విగ్రహం.
Deepening cultural connect and strengthening the fight against illicit trafficking of cultural properties.
I am extremely grateful to President Biden and the US Government for ensuring the return of 297 invaluable antiquities to India. @POTUS @JoeBiden pic.twitter.com/0jziIYZ1GO
— Narendra Modi (@narendramodi) September 22, 2024
