Yoga for MBBS: ఎంబీబీఎస్ కోర్సులో భాగంగా యోగా శిక్షణ: తక్షణమే మొదలుపెట్టాలని ఆదేశం
ప్రస్తుత 2021-22 విద్యా సంవత్సరం నుంచే విద్యార్థులకు యోగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయిస్తూ..కమిషన్ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.
- Bharath Reddy
- Published On : May 3, 2022 / 07:33 AM IST
Yoga
Yoga for MBBS: వైద్య శాస్త్రంలో యోగా ప్రాముఖ్యతను తెలియజేసేలా..ఇకపై వైద్య విద్యార్థులకు యోగా శిక్షణ ఇవ్వాలని జాతీయ వైద్య కమిషన్ నిర్ణయించింది. ఈమేరకు ప్రస్తుత 2021-22 విద్యా సంవత్సరం నుంచే విద్యార్థులకు యోగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయిస్తూ..కమిషన్ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని మెడికల్ కళాశాలలు, ఇన్స్టిట్యూట్ లు, ఉం యూనివర్సిటీల పరిధిలోని వైద్య విద్యార్థులందరికి తక్షణమే యోగా శిక్షణ ప్రారంభించాలని వైద్య కమిషన్ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఫిబ్రవరి – మార్చి నెలల్లో ఎంబీబీఎస్ కోర్సులో జాయిన్ అయిన విద్యార్థులందరికీ యోగా శిక్షణ ప్రారంభించాలనే ఆదేశించింది.
Also read:Power Outage: ఎన్టీపీసీ సింహాద్రిలో నిలిచిపోయిన ఉత్పత్తి.. విశాఖలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం
అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా ప్రతి ఏడాది జూన్ 12 నుంచి జూన్ 21 వరకు దేశంలోని అన్ని వైద్య కళాశాలలు, సంస్థల్లో విద్యార్థులకు యోగా శిక్షణ ఇవ్వాలని, ఫౌండేషన్ కోర్సులో భాగంగా విద్యార్థులందరూ గంట పాటు యోగా చేయాలనీ జాతీయ వైద్య కమిషన్ ఆదేశించింది. వాస్తవానికి ఎంబీబీఎస్ కోర్సులో యోగా శిక్షణ పాఠ్యాంశంగా చేరుస్తూ మార్చి 31న వైద్య కమిషన్ ఉత్తర్వులు వెలువరించింది. అయితే ఆ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తున్నాయంటూ సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
Also read:PM Modi in Germany: భారతదేశంలో నేడు 68వేలకుపైగా స్టార్టప్లు.. బెర్లిన్లో మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
